News April 1, 2025

నంద్యాల జిల్లాలో అత్యధిక ఉష్ణోగ్రత 40.3°C

image

నంద్యాల జిల్లాలో సోమవారం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తు నిర్వహణ సంస్థ (APSDMA) తెలిపింది. అయితే జిల్లాలోని గోస్పాడులో ఏకంగా 40.3°C ఉష్ణోగ్రత నమోదైంది. కాబట్టి ఎండలు ఎక్కువగా ఉన్న సమయాల్లో అవసరం అయితే తప్ప బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ ఎండలకు వేసవి తాపాన్ని తీర్చుకునేందుకు కూల్ డ్రింక్స్ వంటివి ఎక్కువగా తీసుకోరాదని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

Similar News

News October 15, 2025

కోదాడ: బనకచర్ల ప్రాజెక్టుకు మేం వ్యతిరేకం: మంత్రి ఉత్తమ్

image

కోదాడలో ఏర్పాటు చేసిన సంగతన్ సృజన్ అభియాన్ కార్యక్రమంలో పాల్గొన్న నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కడుతున్న బనకచర్ల ప్రాజెక్టు నిర్మాణానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకమని అన్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు వ్యతిరేకమని పేర్కొన్నారు. ఖరీఫ్ సీజన్‌కు ధాన్యం కొనుగోలుకు అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

News October 15, 2025

విజయనగరం జిల్లాలో 6,873 గృహ నిర్మాణాలు పూర్తి: కలెక్టర్

image

PMAY క్రింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసి గృహ ప్రవేశాలకు సిద్ధంగా ఉంచాలని కలెక్టర్ ఎస్.రాం సుందర్ రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో హౌసింగ్ అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 8,259 గృహాలు లక్ష్యం కాగా 6,873 గృహాలు ఇప్పటికే పూర్తయ్యాయని, మిగిలిన 1386 గృహాలను వేగంగా పూర్తి చేయాలని సూచించారు. ముందుగా అర్బన్‌లో సొంత స్థలాలు ఉన్న గృహాలను పూర్తి చేయాలన్నారు.

News October 15, 2025

నిర్ధిష్ట సమయంలో రోడ్ల నిర్మాణం: వీఎంఆర్డీఏ ఛైర్మన్

image

మాస్టర్ ప్లాన్ రహదారులను నిర్ధిష్ట సమయంలో పూర్తి చేయాలని వీఎంఆర్డీఏ ఛైర్మన్ ప్రణవ్ గోపాల్ ఆదేశించారు. అర్హులైన వారికి టీడీఆర్ ఇవ్వాలన్నారు. సమస్యలు లేని చోట్ల రహదారుల నిర్మాణాన్ని ప్రారంభించాలన్నారు. అటవీ శాఖ నుంచి అనుమతులు తీసుకోవాలన్నారు. భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించే <<18005420>>రోడ్డు నిర్మాణం<<>> వేగవంతం చేయాలన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కమిషనర్ రమేశ్, సీఈ వినయ్ కుమార్ పాల్గొన్నారు.