News April 7, 2025

నంద్యాల జిల్లాలో టుడే TOP NEWS

image

☞ దొర్నిపాడు ఎస్‌ఐగా సత్యనారాయణ బాధ్యతలు ☞ రాష్ట్రంలో రూ.3 వేల కోట్లతో రహదారుల అభివృద్ధి: మంత్రి బీసీ☞ PGRSకు 220 దరఖాస్తులు: కలెక్టర్☞ వైసీపీ నేత కాటసాని రాంభూపాల్ రెడ్డి హౌస్ అరెస్ట్☞ బండి ఆత్మకూరు ఎస్ఐ, వ్యవసాయ అధికారి ఎస్‌ఐ, తీవ్ర వాగ్వాదం ☞ ఆళ్లగడ్డ సీఐగా యుగంధర్ బాధ్యతలు ☞ బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసింది రవ్వలకొండలోనే..! ☞ ఆదోని: పెద్ద హరివాణంలో INSTAGRAMలో ప్రేమ.. పెళ్లి

Similar News

News November 16, 2025

నాగారం: కారు ఢీ.. కానిస్టేబుల్ దుర్మరణం

image

నాగారం మండలంలో అతివేగంతో వచ్చిన<<18299567>> కారు ఢీకొనడంతో<<>> కానిస్టేబుల్ కమలాకర్ మృతి చెందగా, మరో ఇద్దరు గాయపడ్డారు. సీఐ నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం… పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కారు ముందు వెళ్తున్న లారీని తప్పించబోయి అదుపుతప్పి ముగ్గురిని ఢీకొట్టింది. తీవ్రంగా గాయపడిన కానిస్టేబుల్ కమలాకర్ చికిత్స పొందుతూ మృతి చెందారు. గాయపడ్డ మరో ఇద్దరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

News November 16, 2025

సఖినేటిపల్లి: మత్స్యకారుల వలకు చిక్కిన అరుదైన చేపలు

image

సఖినేటిపల్లి (M) అంతర్వేది తీరంలో మత్స్యకారుల వలలకు శనివారం అరుదైన చేపలు చిక్కాయి. అంతర్వేదిపల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్‌లో జరిగిన వేలంలో వీటిని కొనుగోలు చేసేందుకు వ్యాపారులు ఆసక్తి చూపారు. ప్రధానంగా 13 గోల్డ్ ఫిష్ (కచ్చిడి) చేపలు ఏకంగా రూ.52 వేలు పలకడం విశేషం. ఇక మార్కెట్లో కోనాం కిలో రూ.600, కవర్లు రూ.70, బోంబేడెక్ రూ.65 చొప్పున ధర పలికాయి. మంచి ధర దక్కడంతో మత్స్యకారులు ఆనందం వ్యక్తం చేశారు.

News November 16, 2025

జనగామ: యాక్సిడెంట్.. మార్చురీలో మృతదేహాలు

image

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండలో HNK-HYD జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో <<18300916>>ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే<<>>. హన్మకొండ జిల్లా బాలసముద్రం ప్రాంతానికి చెందిన నవజీత్ సింగ్, హైదరాబాద్ దోమలగూడకు చెందిన పూలమాటి ఓం ప్రకాశ్ మృతి చెందారు. వీరి మృతదేహాలు పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆసుపత్రిలో ఉంచారు.