News March 22, 2025

నంద్యాల జిల్లాలో దారుణ హత్య

image

నంద్యాల జిల్లా బండిఆత్మకూరు మండలం లింగాపురంలో శనివారం దారుణ హత్య చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నంద్యాల సుధాకర్ రెడ్డి పొలం వద్దకు వెళ్తుండగా కొత్తచెరువు దగ్గర మాటువేసిన గుర్తుతెలియని దుండగులు ఆయనను అత్యంత కిరాతకంగా నరికి చంపారు. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు.

Similar News

News March 25, 2025

బెట్టింగ్ జోలికెళ్లొద్దు: కర్నూలు SP

image

ఐపీఎల్ వేళ యువత బెట్టింగ్‌కు దూరంగా ఉండాలని కర్నూలు SP విక్రాంత్ పాటిల్ సూచించారు. ‘తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభమనే మాయలో పడకండి. అమాయక ప్రజలను మోసగించేందుకు ముఠాలు యాక్టివ్‌గా పనిచేస్తున్నాయి. చట్టవిరుద్ధమైన బెట్టింగ్‌తో కొందరు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. జిల్లాలో ఎవరైనా బెట్టింగ్‌లకు పాల్పడితే 100/112కు సమాచారం ఇవ్వండి. వారి వివరాలు గోప్యంగా ఉంచుతాం’ అని ఎస్పీ తెలిపారు.

News March 25, 2025

ప్యాపిలి ఐఐటీ విద్యార్థి ఆత్మహత్య

image

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని ఎస్.రంగాపురం గ్రామానికి చెందిన ఐఐటీ స్టూడెంట్ అరుణ్ కుమార్ పంజాబ్‌లో ఈ నెల 15న ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కోలుకోలేక నిన్న మృతి చెందాడు. సోమవారం రాత్రి స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువచ్చారు. పంజాబ్‌లో ఐఐటీ చదువుతున్న అరుణ్ క్యాంపస్ సెలక్షన్‌లో ఎంపిక కాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఆ ఇంట తీవ్ర విషాదం నింపింది.

News March 25, 2025

జియో మైసూర్ కంపెనీ గోల్డ్ మెన్స్ సౌత్ ఆఫ్రికా టీమ్స్ సర్వే

image

తుగ్గలి మండలం జొన్నగిరి పరిసర ప్రాంతాలలో జియో మైసూర్ కంపెనీ నిర్వహిస్తున్న గోల్డ్ మైన్స్‌ను సౌత్ ఆఫ్రికా మైనింగ్ నిపుణులు సోమవారం సర్వే చేసినట్లు పత్తికొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి క్రాంతి నాయుడు తెలిపారు. సీఎస్‌ఆర్ పనులు, పర్యావరణ సమస్యలు, ఉద్యోగ అవకాశాలు, ల్యాండ్ లీజ్, స్కిల్ డెవలప్మెంట్ గురించి మైనింగ్ నిపుణులు చర్చించారని ఆయన తెలిపారు. 

error: Content is protected !!