News March 5, 2025
నంద్యాల జిల్లాలో నేటి టాప్ న్యూస్

☞ జగన్.. జైలుకు తక్కువ.. బెయిల్కు ఎక్కువ: ఎంపీ శబరి ☞ కాకనూరులో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మృతి ☞ నిధులు కేటాయించాలని మంత్రి బీసీకి ఎమ్మెల్యేల వినతులు ☞ కొలిమిగుండ్ల పోలీసులకు అభినందనల వెల్లువ ☞ పత్రాల జారీలో జాప్యాన్ని నివారించండి: కలెక్టర్ ☞ శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం రూ.5.69 కోట్లు ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి: ఈవో మురళీధరన్ ☞ పాడి పెంపకంపై RAHTCలో ఉచిత శిక్షణ
Similar News
News December 6, 2025
చెన్నూర్: గెలిపిస్తే.. ఉచిత అంబులెన్స్, పెళ్లికి రూ.5000

చెన్నూర్ మండలం కిష్టంపేట గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. సర్పంచ్ అభ్యర్థి దుర్గం అర్చన సంతోశ్ వినూత్న మేనిఫెస్టోతో ప్రచారం చేస్తున్నారు. ఉచిత అంబులెన్స్, ప్రతి ఆడబిడ్డ పెళ్లికి రూ.5,000 ఆర్థిక సాయం, సెంట్రల్ లైటింగ్ సిస్టంతో సహా 15 రకాల హామీలతో ప్రజల ముందుకు వెళ్తున్నారు. హామీలను నమ్ముతూ ప్రజలకు బాండ్లు రాసి ఇస్తున్నారు.
News December 6, 2025
HYDలో పెరిగిన పాదచారుల ‘రోడ్కిల్’

HYDలో ఫుట్పాత్ల లేమి, ఆక్రమణల కారణంగా పాదచారుల మరణాలు పెరుగుతున్నాయి. 2024లో సుమారు 400 మంది మరణించగా, 1,032 ప్రమాదాలు జరిగాయి. 2025లో ఇప్పటి వరకు 510 మరణాలకు ఇదే కారణం. ఐటీ కారిడార్లలో సైతం కిలోమీటరుకు సగటున 7 అడ్డంకులు ఉండటంతో ఉద్యోగులు నడవలేకపోతున్నారు. 7,500 స్టాల్స్ తొలగించినా, సమస్య పరిష్కారం కాలేదన్న ఆవేదన వ్యక్తమవుతోంది.
News December 6, 2025
అంబేడ్కర్ గురించి ఈ విషయాలు తెలుసా?

*విదేశాల్లో ఎకనామిక్స్లో PhD చేసిన తొలి భారతీయుడు
*కొలంబియా యూనివర్సిటీలో ఎకనామిక్స్లో 29, హిస్టరీలో 11, సోషియాలజీలో 6, ఫిలాసఫీలో 5, ఆస్ట్రాలజీలో 4, పాలిటిక్స్లో 3 కోర్సులు చేశారు
*1935లో ఆర్బీఐ ఏర్పాటులో కీలకపాత్ర
*అంబేడ్కర్ పర్సనల్ లైబ్రరీలో 50వేల పుస్తకాలు ఉండేవి
*దేశంలో పనిగంటలను రోజుకు 14 గం. నుంచి 8 గం.కు తగ్గించారు
>ఇవాళ అంబేడ్కర్ వర్ధంతి


