News March 1, 2025

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

image

నంద్యాల జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 53 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 15,692 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 550 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST

Similar News

News March 1, 2025

కర్నూలు జిల్లాలో 611 మంది విద్యార్థుల గైర్హాజరు

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా 69 పరీక్షా కేంద్రాల్లో ఇంటర్‌ ఫస్టియర్ విద్యార్థులకు పేపర్‌ 1 సెకండ్ లాంగ్వేజ్‌ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 611 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు ప్రాంతీయ ఇంటర్మీడియట్ అధికారి గురువయ్య శెట్టి తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 23,755 విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 23,144 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఎలాంటి మాల్ ప్రాక్టీస్ ఘటనలు చోటు చేసుకోలేదని ఆయన వివరించారు.

News March 1, 2025

జెలెన్‌స్కీ కోసం ట్రంప్‌ను ఎదిరించే సీన్ EUకు ఉందా?

image

పీస్‌డీల్ తిరస్కరించిన జెలెన్‌స్కీకి EU మద్దతు ప్రకటించింది. దానికి ట్రంప్‌ను ధిక్కరించే సీనుందా? అంటే కష్టమే అంటున్నారు విశ్లేషకులు. కూటమిలో సగం దేశాలకు యుద్ధమే ఇష్టం లేదు. గ్యాస్, ఆయిల్ కొరతతో ఇబ్బంది పడుతున్నాయి. జర్మనీలో కల్లోలం, ఫ్రాన్స్‌లో రాజకీయ సంక్షోభం నెలకొన్నాయి. UK పరిస్థితి దారుణం. NATO, UN నుంచి వైదొలగుతానన్న ట్రంప్ వేసే టారిఫ్స్‌ను వారు తట్టుకొనే స్థితిలో లేనే లేరన్నది అసలు నిజం.

News March 1, 2025

నీరాకేఫ్ గీత పారిశ్రామిక కార్పొరేషన్‌కు అప్పగిస్తాం: మంత్రి పొన్నం

image

నిరాకేఫ్ను పూర్తిస్థాయిలో గీతా పారిశ్రామిక కార్పొరేషన్కు అప్పగించడానికి నిర్ణయం తీసుకున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం మినిస్టర్ క్వార్టర్స్‌లో గౌడ సంఘం నేతలు మాజీ ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, పల్లె లక్ష్మణరావు గౌడ్ ఇతర నాయకులు మంత్రిని కలిసి పలు అంశాలను దృష్టికి తెచ్చారు. నీరాకేష్, పాపన్న గౌడ్ విగ్రహం, గౌడ సంఘం భవన నిర్మాణం అంశాలు CM దృష్టికి తీసుకెళ్లినట్లు మంత్రి తెలిపారు.

error: Content is protected !!