News March 18, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ నేర నియంత్రణే లక్ష్యంగా విజిబుల్ పోలీసింగ్: ఎస్పీ
☞ శ్రీశైలంలో 27 నుంచి ఉగాది ఉత్సవాలు: ఈవో
☞ మహానందిలో విషాదం.. ఒకరి మృతి
☞ పచ్చర్లపల్లిలో కాలువలో నీళ్లు తాగేందుకు వెళ్లి మహిళ గల్లంతు
☞ అత్యాచారం కేసులో పేరుసోముల వ్యక్తికి జీవిత ఖైదు
☞ ప్రభుత్వ స్థలాలను గుర్తించండి: కలెక్టర్
☞ పవన్ కళ్యాణ్పై శిల్పా ఫైర్
Similar News
News October 22, 2025
BIG BREAKING: పోచారంలో కాల్పుల కలకలం

హైదరాబాద్ శివారులోని పోచారంలో కాల్పులు కలకలం రేపాయి. బీజేపీ నేతలు తెలిపిన వివరాలు.. బహదూర్పురాకు చెందిన ఇబ్రహీం నాగారం మున్సిపాలిటీకి పరిధి రాంపల్లికి చెందిన సోనూ సింగ్పై యమ్నంపేట కిట్టి స్టీల్ కంపెనీ వద్ద కాల్పులు జరిపాడు. సోనూ పరిస్థితి విషమించడంతో మేడిపల్లిలోని శ్రీకర హాస్పిటల్కు తరలించారు. కాల్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 22, 2025
జగిత్యాల జిల్లా స్థాయి క్రీడా పోటీల ప్రారంభం

మినిస్ట్రీ ఆఫ్ యూత్ ఎఫైర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో జగిత్యాల వివేకానంద స్టేడియంలో జిల్లా స్థాయి క్రీడా పోటీలను డీఆర్డీఏ పీడీ రఘువరన్ బుధవారం ప్రారంభించారు. 20 వాలీబాల్ జట్లు, కబడ్డీలో 14 జట్లు, మహిళా విభాగం కబడ్డీలో 8 జట్లు, వాలీబాల్ లో 6 జట్లు పాల్గొన్నాయి. కబడ్డీ విభాగంలో బీర్పూర్, నక్కలపేట జట్లు ఫైనల్ కు చేరుకున్నాయి. డీవైఎస్ఓ రవికుమార్, డీవైఓ రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
News October 22, 2025
KNR: పోలీసులకు వ్యాసరచన పోటీలు

KNR కమిషనరేట్ కేంద్రంలో జరుగుతున్న పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బందికి రెండు కేటగిరీలలో వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ పోటీలలో పోలీస్ కానిస్టేబుల్ నుండి ఏఎస్సై వరకు గల సిబ్బందికి “పని ప్రదేశంలో లింగ వివక్ష” అనే అంశంపై, ఎస్సై, ఆపై స్థాయి అధికారులకు “క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ బలోపేతం చేయడం” అనే అంశంపై పోటీలు నిర్వహించారు. మొత్తం 117మంది పోలీసులు పాల్గొన్నారు.