News March 23, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞ నంద్యాలలో వార్డెన్ పై పోక్సో కేసు నమోదు
☞ శ్రీశైలంలో ఉగాది ప్రత్యేకతపై Way2 News ఫోకస్
☞ ఎర్ర బంగారంపై వర్ష ప్రభావం
☞ శ్రీశైలంలోని కృష్ణా నదిలో మునిగి యువకుడి మృతి
☞ నల్లమల్ల అడవుల్లో కన్నడ భక్తుల సందడి
☞ కొణిదెల గ్రామానికి రూ.50 లక్షలు: పవన్ కళ్యాణ్
☞ ఆళ్లగడ్డలో కిలో చికెన్ ధర రూ.90
☞ స్థల వివాదంతోనే సుధాకర్ రెడ్డి హత్య: బండి ఆత్మకూరు ఎస్ఐ
☞ PGRS వేళలో మార్పులు: కలెక్టర్
Similar News
News October 31, 2025
పంట, రైతుల వివరాలను నమోదు చేయాలి: వ్యవసాయ అధికారి

సాగు చేస్తున్న పంట, రైతుల వివరాలను యాప్లో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి విజయనిర్మల అన్నారు. బయ్యారం మండలం కొత్తపేటలో వరి సాగు పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. యాప్లో నమోదు చేసుకోవడం వల్ల పంట క్రయ విక్రయాలు సులభం అవుతాయని పేర్కొన్నారు. తుఫాను వల్ల నష్టపోయిన పంటలను ప్రభుత్వ ఆదేశాల మేరకు సర్వే చేస్తామన్నారు. ఏవో రాజు, ఏఈవోలు నాగరాజు, అఖిల్ పాల్గొన్నారు.
News October 31, 2025
ANU దూరవిద్య డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య కేంద్రం పరిధిలో ఈ ఏడాది జులై, ఆగస్టు మాసాలలో జరిగిన డిగ్రీ సప్లమెంటరీ సంవత్సరాంతపు పరీక్షల ఫలితాలను శుక్రవారం విడుదల చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ వంకాయలపాటి వెంకటేశ్వర్లు, పరీక్షల విభాగ కోఆర్డినేటర్ డి.రామచంద్రన్ లు తెలిపారు. నవంబరు 12వ తేదీలోగా రీవాల్యుయేషన్ కు దరఖాస్తులు అందజేయాలని సూచించారు. ప్రతి పేపర్కు రూ.770 చొప్పున ఫీజు చెల్లించాలన్నారు.
News October 31, 2025
తప్పుడు వార్తలు ప్రచురిస్తే చర్యలు: ఎస్పీ హెచ్చరిక

పత్రికా స్వేచ్ఛ ముసుగులో ప్రభుత్వ వ్యవస్థలను అప్రతిష్ట పాలు చేసే చర్యలను తీవ్రంగా పరిగణిస్తామని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు అన్నారు. డిప్యూటీ సీఎం పర్యటన సమయంలో అవనిగడ్డ మండలం రామకోటిపురం సర్పంచ్ను ఫొటో ఎగ్జిబిషన్ వద్ధకు రానివ్వలేదని ఓ పత్రిక ప్రచురించిన వార్తపై శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంక్షలను వక్రీకరించి తప్పుడు వార్తలు ప్రచురిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు.


