News March 31, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యమైన వార్తలు

* కర్ణాటక భక్తులతో పోటెత్తిన మహానంది క్షేత్రం* రంజాన్ తోఫా కిట్లను పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్* ఈద్గాల వద్ద పోలీసుల పటిష్ట బందోబస్తు* బేతంచర్ల ఈద్గాలో నల్ల బ్యాడ్జిలతో నిరసన * బనగానపల్లెలో వైసీపీ కార్యకర్తపై దాడి* ఈకేవైసీ గడువును సద్వినియోగం చేసుకోండి: కొలిమిగుండ్ల MRO * వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ప్లకార్డులతో నిరసన
Similar News
News April 19, 2025
కలిదిండి: ఇద్దరు బైక్ దొంగలు అరెస్ట్

కలిదిండి మండలంలో వరుసగా జరుగుతున్న మోటార్ సైకిళ్ల దొంగతనాలపై పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. శనివారం ఇద్దరిని అరెస్టు చేసి సుమారు రూ.3,50,000 విలువ చేసే 5 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. దొంగలను పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన కలిదిండి ఎస్ఐ వెంకటేశ్వరరావు, ఏఎస్ఐ వెంకటేశ్వరరావు, పీసీలు రమేశ్ పొట్టి కాసులు, శ్రీనులను CI రవికుమార్ అభినందించారు.
News April 19, 2025
MBNR: కోర్టు డ్యూటీ అధికారులతో ఎస్పీ సమావేశం

మహబూబ్నగర్ జిల్లా ఎస్పీ డి.జానకి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం కాన్ఫరెన్స్ నందు కోర్టు డ్యూటీ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ.. న్యాయ సంబంధిత విధుల్లో నిర్లక్ష్యం వద్దని, ప్రతి కేసు విచారణలో చార్జ్షీట్లను నిర్దేశిత కాల వ్యవధిలో న్యాయస్థానాలకు సమర్పించాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. కోర్టు అధికారులు విధులలో అప్రమత్తంగా ఉండాలన్నారు.
News April 19, 2025
సమిష్టి కృషితో విజయం సాధించాం: గంటా

కూటమి ప్రభుత్వంలో ప్రతీ ఒక్కరి సమిష్టి కృషితోనే విజయం సాధించామని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు శనివారం మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గిన అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైసీపీపై పూర్తి వ్యతిరేకతతోనే కూటమిలో ఆ పార్టీ కార్పొరేటర్లు చేరారని అన్నారు. జీవీఎంసీకి మంచి రోజులు రానున్నాయని తెలిపారు. గత ప్రభుత్వంలో జీవీఎంసీలో అభివృద్ధి కుంటిపడిందన్నారు.