News April 4, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

image

☞నంద్యాల GGHలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ☞ఎద్దుల బండలాగుడు పోటీలు ప్రారంభించిన మంత్రి BC☞కందనాతిలో పిడుగుపాటుతో బాలుడి మృతి☞బనగానపల్లె ఆసుపత్రిలో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీ☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLAలు☞నందవరం చౌడమ్మ హుండీ ఆదాయం రూ.4.21లక్షలు☞మంత్రి లోకేశ్‌ను కలిసిన ఆళ్లగడ్డ MLA☞కేంద్ర మంత్రికి ఎంపీ శబరి వినతి☞8 మంది ఎస్ఐలకు పోస్టింగులు

Similar News

News November 3, 2025

నేడు అమలాపురంలో పీజీఆర్ఎస్

image

అమలాపురం కలెక్టరేట్ వద్ద సోమవారం యథావిధిగా ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం ఉంటుందని ఆయన వివరించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

News November 3, 2025

భక్తులు అప్రమత్తంగా ఉండాలి: కర్నూలు ఎస్పీ

image

కార్తీకమాసం సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో దేవాలయాలు, నదీతీరాలకు తరలి వస్తున్న నేపథ్యంలో జాగ్రత్తలు తప్పనిసరి అని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ సూచించారు. మహిళలు దీపాలు వెలిగించి వాటిని నదుల్లో వదిలే సమయంలో, స్నానాల సమయంలో జాగ్రత్తలు పాటించాలని, చిన్న పిల్లలతో మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ఓర్వకల్ శ్రీ కాల్వబుగ్గ, రామేశ్వర, బ్రహ్మగుండేశ్వర, నందవరం దేవాలయంలో భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

News November 3, 2025

‘జిల్లాలో అన్ని ప్రధాన శివాలయాల వద్ద పటిష్ఠభద్రతా ఏర్పాట్లు చేయాలి’

image

అల్లూరి జిల్లాలోని అన్ని ప్రధాన శివాలయాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని SP అమిత్ బర్దార్ పోలీసు అధికారులను ఆదేశించారు. కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా శివాలయాలకు భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందన్నారు. ఈమేరకు పాడేరు ఉమాలింగేశ్వర ఆలయం, చింతపల్లి, సీలేరు ఉమాశంకర దేవాలయాలు, హుకుంపేట మత్స్యలింగేశ్వర ఆలయం తదితర ఆలయాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.