News April 4, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు!

☞ VRలో ఉన్న 8 మంది SIలకు పోస్టింగ్: ఎస్పీ ☞ శ్రీశైలం ఘాట్ రోడ్డులో కారు దగ్ధం ☞ అహోబిలంలో భారీ వర్షం ☞ కోవెలకుంట్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్గా డా.వేణుగోపాల్ ☞ వైసీపీ కార్యకర్తకు కాటసాని పరామర్శ ☞ బైక్పై దేశ పర్యటన.. మహానందిలో పూజలు ☞ సభలకు ముందస్తు అనుమతి తప్పనిసరి: ఏఎస్పీ ☞ సున్నిపెంటలో పర్యటించిన నంద్యాల జేసి ☞ ముస్లిం సమాజానికి కూటమి ప్రభుత్వం ద్రోహం: MLC ఇషాక్
Similar News
News December 5, 2025
సంగారెడ్డి డీపీవో సాయిబాబా సస్పెండ్

సంగారెడ్డి జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) సాయిబాబాపై ప్రభుత్వం వేటు వేసింది. ప్రస్తుతం జరుగుతున్న పంచాయతీ ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించినందున ఆయనపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది. ఈ మేరకు శుక్రవారం రాత్రి పంచాయతీరాజ్ డైరెక్టర్ శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు.
News December 5, 2025
సీఎం స్టాలిన్తో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ

తమిళనాడు రాష్ట్రం చెన్నైలోని రాష్ట్ర మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి శుక్రవారం తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ను ఆయన కార్యాలయంలో కలిశారు. ఈ నెల 8, 9 తేదీల్లో హైదరాబాద్లో జరిగే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు హాజరు కావాలని ఆయనకు ఆహ్వాన పత్రం అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, స్టాలిన్తో రాష్ట్ర అభివృద్ధి అంశాలపై చర్చించారు.
News December 5, 2025
SVU: పరీక్ష ఫలితాలు విడుదల.!

శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది M.L.I.Sc 3, 4 M.A హిస్టరీ, సోషల్ వర్క్, హ్యూమన్ రైట్స్ ఉమెన్ స్టడీస్ మొదటి సెమిస్టర్ పరీక్షలు, దూరవిద్య విభాగం (SVU DDE) ఆధ్వర్యంలో B.LI.Sc పరీక్షలు జరిగాయి. ఈ పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఫలితాలను https://www.manabadi.co.in/ వెబ్ సైట్ ద్వారా తెలుసుకోగలరు.


