News April 6, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ జిల్లాలో ఘనంగా శ్రీరామనవమి వేడుకలు ☞ హజ్ యాత్ర అనేది ముస్లింలకు ఓ కల: మంత్రి ఫరూక్ ☞ రాములోరి కళ్యాణంలో కుటుంబ సమేతంగా పాల్గొన్న మంత్రి బీసీ ☞ ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరిస్తాం: ఎమ్మెల్సీ భూమిరెడ్డి ☞ నందిపాడులో ప్రమాదం.. యువకుడి మృతి ☞ బీసీ రాజారెడ్డిని కలిసిన సింగర్ కరీముల్లా ☞ కురుకుందలో గాలివాన బీభత్సం ☞ రేపు కలెక్టరేట్లో PGRS: కలెక్టర్ రాజకుమారి

Similar News

News November 20, 2025

రేవంత్ దుర్మార్గాన్ని న్యాయపరంగా ఎదుర్కొంటాం: హరీశ్ రావు

image

TG: ఫార్ములా ఈ-కార్ రేసును పూర్తి పారదర్శకతతో నిర్వహించామని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. KTR ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతి ఇవ్వడంపై స్పందించారు. ‘KTRపై కక్ష సాధింపు చర్యలకు పరాకాష్ఠ ఇది. ప్రశ్నించే గొంతులను CM రేవంత్ నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ కేసులు పెట్టి ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారు. KTRకు BRS అండగా ఉంటుంది. రేవంత్ దుర్మార్గ వైఖరిని న్యాయపరంగా ఎదుర్కొంటాం’ అని ట్వీట్ చేశారు.

News November 20, 2025

రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు: కలెక్టర్ సత్యప్రసాద్

image

మల్లాపూర్ మండలం ముత్యంపేటలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ సత్యప్రసాద్ పరిశీలించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని నిర్వాహకులను ఆయన ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లు జాప్యం జరగకుండా చూడాలన్నారు. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. కార్యక్రమంలో ఆర్డీవో శ్రీనివాస్, తహశీల్దార్ రమేశ్ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.

News November 20, 2025

నాంపల్లి కోర్టులో ముగిసిన జగన్ విచారణ

image

HYD నాంపల్లి సీబీఐ కోర్టులో YCP అధినేత జగన్ విచారణ ముగిసింది. కోర్టులో ఆయన 5 నిమిషాలు మాత్రమే కూర్చున్నారు. వ్యక్తిగతంగా హాజరైనట్లు కోర్టు రికార్డులో నమోదు చేసింది. విచారణ అనంతరం ఆయన కోర్టు నుంచి బయటకు వచ్చారు. కాసేపట్లో లోటస్ పాండ్‌లోని తన నివాసానికి వెళ్లనున్నారు. విదేశీ పర్యటన పిటిషన్‌కు సంబంధించి జగన్ కోర్టుకు హాజరయ్యారని, ఛార్జ్‌షీట్లకు సంబంధించి ఎలాంటి విచారణ జరగలేదని ఆయన లాయర్ తెలిపారు.