News April 9, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు.!

☞చాగలమర్రిలో రికార్డు స్థాయిలో 38⁰C ఉష్ణోగ్రత
☞రేవనూరు హుస్సేన్ వలి స్వామి దర్గా వద్ద భారీ పోలీస్ భద్రత
☞పాణ్యం రహదారిపై బొలెరో బోల్తా
☞CMRF చెక్కులు పంపిణీ చేసిన MLA కోట్ల
☞క్రమశిక్షణకు మారుపేరు టీడీపీ: నందికొట్కూరు MLA
☞ఫరూక్ ను పరామర్శించిన మంత్రి నిమ్మల
☞కోర్టు ఆదేశాలతో అంగన్వాడి హెల్పర్ రమాదేవి కొనసాగింపు: CDPO
☞డోన్ రైల్వే స్టేషన్ పరిధిలో గుర్తు తెలియని మృతదేహం లభ్యం.
Similar News
News July 8, 2025
మల్టీపర్పస్ వర్కర్ల జీతాలకు నిధులు విడుదల

TG: గ్రామ పంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీపర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల పెండింగ్ జీతాలు రూ.150 కోట్లు ఆర్థిక శాఖ విడుదల చేసింది. ఇవాళ గ్రామ పంచాయతీల ఖాతాల్లో ఈ నిధుల జమ కానుండగా, ఒకట్రెండు రోజుల్లో 53 వేల మంది మల్టీ పర్పస్ వర్కర్లు తమ జీతాలు అందుకోనున్నారు.
News July 8, 2025
JGTL: ‘90% డెలివరీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే జరగాలి’

జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని కలెక్టర్ సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. GOVT. ఆసుపత్రులలో డెలివరీలను ప్రోత్సహించడానికి ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత 3నెలల్లో ప్రభుత్వాసుపత్రులలో డెలివరీల సంఖ్య తక్కువగా ఉందని, సిబ్బంది పనితీరు మెరుగుపరుచుకోవాలన్నారు. వచ్చే 3నెలల్లో 90% డెలివరీలు ప్రభుత్వాసుపత్రిల్లోనే జరిగేటట్లు చూడాలన్నారు. DMHO పాల్గొన్నారు.
News July 8, 2025
యాప్స్లో మోసం.. నాలుగింతలు వసూలు!

రైడ్ పూలింగ్ యాప్స్ల దోపిడీపై ఓ మహిళ చేసిన ట్వీట్ వైరలవుతోంది. బెంగళూరుకు చెందిన మహిళ 2.6kms వెళ్లేందుకు ఆటో బుక్ చేయగా రూ.172.45 చూపించింది. అదే దూరానికి డైరెక్ట్గా ఆటోలో వెళ్తే రూ.39 ఛార్జీని తీసుకున్నట్లు ఆమె ట్వీట్ చేశారు. దీంతో యాప్స్లో జరుగుతున్న మోసాలపై చర్చ మొదలైంది. Ola, Rapido, Uber వంటి యాప్స్లో స్కామ్స్ జరుగుతున్నాయని, తామూ ఈ వ్యత్యాసాన్ని గమనించినట్లు పలువురు చెబుతున్నారు.