News April 12, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞బండి ఆత్మకూరులో ఇంటర్ ఫెయిల్ కావడంతో మరో విద్యార్థి ఆత్మహత్య☞అన్నమయ్య జిల్లా DRDC సమావేశంలో మంత్రి బీసీ☞ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాల విద్యార్థుల ప్రతిభ☞నంద్యాల మున్సిపల్ కార్యాలయం మార్పునకు రంగం సిద్ధం☞మహానందిలో ఒకేరోజు 15 పెళ్లిళ్లు☞మానవత్వం చాటుకున్న ఎమ్మెల్యే గౌరు చరిత ☞బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రం: చింతలపల్లె కోటేశ్
Similar News
News April 15, 2025
బంగ్లాదేశ్లో భారత జట్టు పర్యటన.. షెడ్యూల్

భారత సీనియర్ మెన్స్ జట్టు ఈ ఏడాది బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లనుంది. ఆగస్టులో జరిగే ఈ పర్యటనలో భాగంగా 3 వన్డేలు, 3 T20లు ఆడనుంది. మిర్పూర్ వేదికగా 17, 20 తేదీల్లో తొలి రెండు వన్డేలు ఆడనుంది. ఆగస్టు 23న చట్టోగ్రామ్లో 3 వన్డే ఆడనుంది. ఆ తర్వాత తొలి T20 ఆగస్టు 26న చట్టోగ్రామ్లో, మిగతా రెండు T20లను ఆగస్టు 29, 31 తేదీల్లో మిర్పూర్ వేదికగా ఆడనుంది. ఈ మేరకు షెడ్యూల్ను బీసీసీఐ విడుదల చేసింది.
News April 15, 2025
త్వరలో ‘SSMB29’ గ్లింప్స్?

రాజమౌళి, మహేశ్బాబు కాంబోలో తెరకెక్కుతోన్న ‘SSMB29’ సినిమా అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఫ్యాన్స్ను అబ్బురపరిచేలా గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టన్నింగ్ గ్లింప్స్ వీడియోను మేకర్స్ సిద్ధం చేస్తున్నారని, ఇది పూర్తయ్యాక అనౌన్స్మెంట్ చేస్తారని సినీవర్గాలు చెబుతున్నాయి. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.
News April 15, 2025
మా వాళ్లు బర్త్డే విషెస్ చెప్పలేదు: రాజాసింగ్

తెలంగాణ BJP నాయకత్వంపై ఆ పార్టీ సీనియర్ నేత రాజాసింగ్ మరోసారి అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీ కోసం ఎంత కష్టపడినా సీనియర్లు తనను గుర్తించడం లేదన్నారు. ఇవాళ తన పుట్టినరోజున అయినా సొంత పార్టీ సీనియర్లు కనీసం విషెస్ చెప్పలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సీఎం రేవంత్ రెడ్డి శుభాకాంక్షలు చెప్పారన్నారు. ఈ వ్యాఖ్యలపై స్పందించిన TBJP చీఫ్ కిషన్ రెడ్డి రాజాసింగ్ వ్యవహారంపై అంతర్గతంగా చర్చిస్తామన్నారు.