News April 15, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యంశాలు.!

image

☞ఒంటిమిట్ట వద్ద రోడ్డు ప్రమాదం.. ముగ్గురు నంద్యాల వాసుల మృతి
☞నంద్యాల మున్సిపల్ పార్కులో విద్యార్థి మృతి
☞మహానంది వద్ద వ్యక్తి మృతి.. రంగంలోకి ఫోరెన్సిక్ అధికారులు
☞బనగానపల్లెలో జొన్నల కొనుగోలు కేంద్రం ప్రారంభించిన మంత్రి
☞శ్రీశైలంలో రద్దీ.. ప్రత్యేక దర్శనాల రద్దు
☞జిల్లాలో ఘనంగా అంబేడ్కర్ జయంతి వేడుకలు
☞నంద్యాల రైల్వే స్టేషన్ పరిశీలించిన DRM
☞ రక్తంతో అంబేడ్కర్ చిత్రం.

Similar News

News October 22, 2025

వరంగల్‌లో నకిలీ ఏసీబీ మోసం

image

గుర్తు తెలియని వ్యక్తులు ఏసీబీ అధికారులమని చెప్పి ఆర్టీఏ ఎంవీఐల నుంచి దశల వారీగా రూ.10.20 లక్షలు కాజేశారు. ఫోన్లలో నకిలీ బెదిరింపులు చేయడంతో ఓ ఎంవీఐకు అనుమానం రావడంతో వెంటనే WGL ఏసీబీ డీఎస్సీ సాంబయ్యను ఆశ్రయించారు. దీంతో నిజం తెలిసింది. ఆర్టీఏ అధికారులు మోసపోయిన వివరాలు గుట్టుగా ఉంచాలని ప్రయత్నించగా, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. దుండగులను వెతికే పనిలో పడ్డారు.

News October 22, 2025

ములుగు: మహా జాతరకు ఇంకా 98 రోజులే !

image

మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరకు ఇంకా 98 రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. జాతర సమయం దగ్గర పడుతుండగా పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గద్దెల విస్తరణ పనులు తప్ప ఇతర పనులు ఇంకా మొదలు కాకపోవడంతో సర్వత్ర ఆందోళన నెలకొంది. జాతర సమయానికి పనులు పూర్తవుతాయా ?, ప్రతి జాతరలా హడావిడి పనులు చేసి చేతులు దులుపుకుంటారా ? అని భక్తులు అనుమానవం వ్యక్తం చేస్తున్నారు.

News October 22, 2025

జీకే వీధి: డోలి మోతలోనే యువతి మృతి

image

జీకే వీధి (M) నేలపాడులో సుమిత్ర (22) మంగళవారం కాఫీ తోటకు వెళుతూ మార్గ మధ్యలో స్పృహ తప్పి పడిపోయింది. గమనించిన గ్రామస్థులు ఆమెను డోలి కట్టి ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందింది. తమ గ్రామానికి రోడ్డు సదుపాయం ఉంటే తమ బిడ్డ బతికేదని, డోలిలో తీసుకెళ్లడం వల్ల వైద్యం సకాలంలో అందక మృతి చెందిందని కుటుంబీకులు వాపోయారు.