News March 6, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ కొణిదెల పాఠశాలలో డీఈవో తనిఖీ ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు 32 ప్రత్యేక బస్సులు ☞ Way2News ఎఫెక్ట్.. శ్రీశైలంలో తొలగిన దుర్వాసన ☞ మహానందిలో అద్భుత శిల్ప సంపద ☞ SDPI కార్యాలయంపై ఈడీ దాడులు ☞ చాగలమర్రిలో బైకులకు నిప్పు ☞ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ☞ డాక్టర్ పట్టా అందుకున్న ఎంబాయి విద్యార్థి ☞ బెలూం శింగవరంలో భార్యపై రోకలితో దాడి.. మృతి ☞ ALGలో ఉచితంగా ‘ఛావా’ చిత్ర ప్రదర్శన

Similar News

News November 17, 2025

తెలంగాణ న్యూస్ అప్డేట్స్

image

*CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన సోమవారం రాష్ట్ర క్యాబినెట్ భేటీ కానుంది. స్థానిక ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకునే అవకాశం.
*కాంగ్రెస్, ప్రభుత్వంలో నేతల పనితీరు ఆధారంగా ప్రక్షాళన చేయాలని AICC కార్యదర్శి సంపత్ కుమార్ అన్నారు. కొన్ని కలుపు, గంజాయి మొక్కలు ఉన్నాయని, వాటిని ఏరిపారేయాలని చెప్పారు.
* యాదగిరి గుట్టకు లక్షమందికి పైగా భక్తుల రాక. ఒక్క రోజే రూ.కోటికి పైగా ఆదాయం వచ్చినట్లు అధికారుల వెల్లడి.

News November 17, 2025

నల్గొండ ఎస్పీ పేరుతో ఫేక్ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్

image

నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పేరుతో సైబర్ నేరగాళ్లు నకిలీ ఫేస్‌బుక్‌ ప్రొఫైల్ క్రియేట్ చేశారు. దీంతో ఈ నకిలీ ఐడీ నుంచి వచ్చే ఎలాంటి మెసేజ్‌లకు, రిక్వెస్ట్‌లకు స్పందించవద్దని ప్రజలకు ఎస్పీ సూచించారు. ఆకతాయిలు ఇలాంటి ఫేక్ ఐడీలు సృష్టించి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

News November 17, 2025

కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన నార్పల యువతి

image

5,895 మీటర్లు ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని నార్పల మండలం దుగుమర్రికి చెందిన యువతి కె. కుసుమ అధిరోహించారు. దీంతో శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ కుసుమను ఆదివారం అభినందించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఫ్రీ స్టాండింగ్ పర్వతం, ఆఫ్రికా ఖండంలోనే అత్యంత ఎత్తైన కిలిమంజారో శిఖరంపై కుసుమ (19) ఈ నెల 12న భారత జెండా ఆవిష్కరించడం గర్వకారణమన్నారు.