News March 6, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ కొణిదెల పాఠశాలలో డీఈవో తనిఖీ ☞ అహోబిలం బ్రహ్మోత్సవాలకు 32 ప్రత్యేక బస్సులు ☞ Way2News ఎఫెక్ట్.. శ్రీశైలంలో తొలగిన దుర్వాసన ☞ మహానందిలో అద్భుత శిల్ప సంపద ☞ SDPI కార్యాలయంపై ఈడీ దాడులు ☞ చాగలమర్రిలో బైకులకు నిప్పు ☞ రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం ☞ డాక్టర్ పట్టా అందుకున్న ఎంబాయి విద్యార్థి ☞ బెలూం శింగవరంలో భార్యపై రోకలితో దాడి.. మృతి ☞ ALGలో ఉచితంగా ‘ఛావా’ చిత్ర ప్రదర్శన

Similar News

News October 17, 2025

అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు

image

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు మరణాల తర్వాత అజిత్రోమైసిన్ సిరప్‌లో పురుగులు రావడం కలకలం రేపుతోంది. గ్వాలియర్ జిల్లా మోరార్ ప్రభుత్వాస్పత్రిలో ఇచ్చిన అజిత్రోమైసిన్ యాంటీబయాటిక్ సిరప్‌లో పురుగులున్నాయని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆస్పత్రిలోని మిగిలిన 306 బాటిల్స్‌ను సీజ్ చేసి, టెస్ట్ కోసం శాంపిల్స్ భోపాల్ పంపారు. అది జనరిక్ మెడిసిన్ అని, MPలోని ఓ కంపెనీ తయారు చేస్తోందని అధికారులు వెల్లడించారు.

News October 17, 2025

విజయవాడ: విద్యార్థి మృతిపై అనుమానాలు

image

సింగ్ నగర్‌లో 9వ తరగతి విద్యార్థి యశ్వంత్ మృతిపై అనుమానాలు నెలకొన్నాయి. బాత్‌రూమ్‌లో 2 అడుగుల ఎత్తులో ఉన్న హ్యాంగర్‌కు ఉరి వేసుకున్నట్లు కనిపించడంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా యశ్వంత్ పేరెంట్స్ విడిపోయారు. తల్లికి క్యాన్సర్‌ కావడంతో యశ్వంత్ స్కూల్‌కు సరిగా వెళ్లడం లేదు. చెల్లి దివ్యాంగురాలు. ఈ పరిణామాలతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు.

News October 17, 2025

నెల్లూరు: ఎందుకీ నిర్లక్ష్యం..!

image

నెల్లూరు జిల్లాలో PM కిసాన్ నిధుల పంపిణీ ఆలస్యం అవుతోందన్న వాదనలు వినిపిస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2.19 లక్షల మంది రైతులకు రూ.253.79 కోట్లను ప్రభుత్వాలు జమ చేస్తున్నాయి. గతేడాది వరకు 1.67 లక్షల మంది ఖాతాల్లో 3 విడతల్లో కేవలం రూ.100 కోట్లు మాత్రమే జమైంది. మరో రూ.150 కోట్లు జమవ్వాల్సి ఉంది. ఈకేవైసీ, బ్యాంక్ లింకేజీ, ఫిజికల్ రీ వెరిఫికేషన్ చేయకపోవడంతో దాదాపు 7 వేల మంది ఈ నిధులకు దూరంగా ఉన్నారు.