News March 7, 2025
నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

☞ ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది: కాటసాని☞ మహిళలకు జిల్లా వరకే ఫ్రీ జర్నీపై భిన్నాభిప్రాయాలు ☞ మార్చిలోనే భగభగలు.. బండి ఆత్మకూరులో 39.5 డిగ్రీలు ☞ డోన్లో ముగ్గురు నాటుసారా విక్రేతల అరెస్ట్ ☞ కేసి కెనాల్ కు కొనసాగుతున్న నీటి విడుదల ☞ 13న నందివర్గంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ☞ బనగానపల్లె శివరామ్ థియేటర్ వద్ద పోలీసు బందోబస్తు ☞ గాలికుంటు టీకాల కార్యక్రమం
Similar News
News December 1, 2025
అధికారుల వాట్సాప్ గ్రూప్లో బాపట్ల రైతులు..!

తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతులు వారి సమస్యలను ఉన్నతాధికారులకు చెప్పుకునేందుకు రైతులతో కూడిన వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేయాలని కలెక్టర్ వినోద్ కుమార్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. రైతులు వారి సమస్యలను వాట్సాప్ గ్రూప్లో పెట్టే విధంగా అవగాహన కల్పించాలన్నారు. సోమవారం ఆయన వ్యవసాయ శాఖ అధికారుల సమావేశంలో సూచించారు.
News December 1, 2025
జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు: పోలీస్ కమిషనర్

గ్రామ పంచాయతీ ఎన్నికలతో పాటు అక్రమ రవాణా నియంత్రణలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టామని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. అర్ధరాత్రి సమయాల్లో అనుమానిత వ్యక్తుల వివరాలు, వేలిముద్రలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. విజిబుల్ పోలీసింగ్ను పటిష్టంగా అమలు చేస్తేనే నేరాలు నియంత్రణలో ఉంటాయని, గస్తీ, పెట్రోలింగ్ను ముమ్మరం చేస్తున్నారని ఆయన తెలిపారు.
News December 1, 2025
తగ్గుతున్న GST ఆదాయ వృద్ధి!

TG: రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయం క్రమేణా తగ్గుముఖం పడుతోంది. NOVలో ₹3910 కోట్ల GST వసూలైనట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. 2024 NOVలో వచ్చిన ₹3880 కోట్ల ఆదాయంతో పోలిస్తే దాదాపు 1% పెరిగింది. అయితే అయితే ఇటీవల గణాంకాలను పరిశీలిస్తే నెలనెలా పెరగాల్సిన ఆదాయం తగ్గుముఖం పడుతోందని అధికారులు పేర్కొంటున్నారు. GST-2.O అమలు చేసినప్పటి తరువాత నుంచి ఈ పరిస్థితి కనిపిస్తోందని వారు చెబుతున్నారు.


