News March 7, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ ప్రజల సంక్షేమాన్ని కూటమి ప్రభుత్వం గాలికొదిలేసింది: కాటసాని☞ మహిళలకు జిల్లా వరకే ఫ్రీ జర్నీపై భిన్నాభిప్రాయాలు ☞ మార్చిలోనే భగభగలు.. బండి ఆత్మకూరులో 39.5 డిగ్రీలు ☞ డోన్‌లో ముగ్గురు నాటుసారా విక్రేతల అరెస్ట్ ☞ కేసి కెనాల్ కు కొనసాగుతున్న నీటి విడుదల ☞ 13న నందివర్గంలో రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలు ☞ బనగానపల్లె శివరామ్ థియేటర్ వద్ద పోలీసు బందోబస్తు ☞ గాలికుంటు టీకాల కార్యక్రమం

Similar News

News November 23, 2025

హనుమకొండ మోడల్ బస్టాండ్ నిర్మాణంపై మల్లగుల్లాలు!

image

HNKలో మోడల్ బస్టాండ్ నిర్మాణం మళ్లీ అనిశ్చితిలోకి వెళ్లింది. రూ.80 కోట్ల వ్యయంతో 5 అంతస్తుల భవన సముదాయం, ఆర్ఎం కార్యాలయం, షాపింగ్ కాంప్లెక్స్, సినిమా హాల్, వీఐపీ లాంజ్ వంటి ఏర్పాట్లతో కుడా అధికారులు డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే తాజా సమావేశాల్లో ఆర్టీసీ ఉన్నతాధికారులు భవనాన్ని తామే నిర్మిస్తామని ప్రకటించడంతో కుడా నిర్మాణ బాధ్యతల నుంచి తప్పుకుంది. దీంతో ప్రాజెక్ట్ ముందడుగు తాత్కాలికంగా నిలిచాయి.

News November 23, 2025

హనుమకొండ: 25-29 వరకు ఇన్‌‌స్ట్రక్టర్లకు శిక్షణ

image

జిల్లాలో ప్రీప్రైమరీ విద్యా బోధన నాణ్యతను మెరుగుపర్చేందుకు 45 పాఠశాలల నుంచి ఎంపికైన 45 ఇన్‌‌స్ట్రక్టర్లకు ఈ నెల 25-29 వరకు శిక్షణ ఇవ్వనున్నారు. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్లో జరిగే ఈ శిక్షణలో బోధనా నైపుణ్యాలు, తరగతి నిర్వహణ, పర్యవేక్షణ అంశాలపై డీఆర్పీలు మార్గదర్శనం చేయనున్నారు. డిసెంబర్ 1న హెచ్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు కోర్సు డైరెక్టర్ డా.బండారు మన్మోహన్ తెలిపారు.

News November 23, 2025

HYD: సైబర్ నేరాలపై ప్రతిజ్ఞ చేయించిన సీపీ

image

సైబర్ నేరాల నివారణ కోసం ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని సీపీ సజ్జనార్ అన్నారు. శనివారం చార్మినార్ ప్రాంగణంలో ‘జాగృత్ హైదరాబాద్- సురక్షిత్ హైదరాబాద్’ పేరుతో సైబర్ నేరాల అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మోసపూరిత లింక్‌ను ఓపెన్ చేయబోమని ప్రతిజ్ఞ చేయించారు. ఒకవేళ సైబర్ మోసానికి గురైతే వెంటనే 1930, సైబర్ పోర్టల్ www.cybercrime.gov.inలో ఫిర్యాదు చేయాలన్నారు.