News February 27, 2025

నంద్యాల జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

image

☞ ఆత్మకూరు రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
☞ టీడీపీతోనే ముస్లింలకు పెద్దపీట: మంత్రి బీసీ
☞ మంత్రి ఫరూక్‌ను కలిసిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్
☞ శ్రీశైలంలో చిరుత కళేబారానికి పోస్టుమార్టం పూర్తి
☞ జమ్మలమడుగులో కాకరవాడ వ్యక్తి సూసైడ్
☞ కోడుమూరులో కారు దగ్ధం☞ ఎమ్మిగనూరులో చోరీ
☞ భక్తులతో కిక్కిరిసిన మహానంది క్షేత్రం
☞ పెట్నికోట క్రీడలలో రాష్ట్రస్థాయి విజేతలుగా ప్యాపిలి, గుంటూరు

Similar News

News July 11, 2025

జనాభా లెక్కల్లోనూ రంగారెడ్డి జిల్లా తగ్గేదేలే!

image

రంగారెడ్డి జిల్లాలో జనాభా శరవేగంగా పెరుగుతోంది. 2011 జనాభా లెక్కల ప్రకారం జిల్లాలో 24,46,265 మంది ఉండగా.. వీరిలో 12,54,184 మంది పురుషులు,11,92,081 మంది మహిళలు ఉన్నారు. 2023 నవంబర్‌లో ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ఓటర్ల జాబితా ప్రకారం 18 ఏళ్లు పైబడిన వారి సంఖ్య 35,23,219కు చేరింది. జిల్లా పరిశ్రమలతో పాటు రియల్ ఎస్టేట్ రంగాల్లో అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో 13 ఏళ్లలో జనాభా 48 లక్షలకు చేరిందని అంచనా.

News July 11, 2025

MBNR: పల్లె పోరు.. రిజర్వేషన్ల ఫీవర్

image

ఆగస్టు నెలాఖరు కల్లా పరిషత్, సర్పంచ్ ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయనున్నట్లు కాంగ్రెస్ ప్రకటించింది. ఇప్పటికే పల్లెల్లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఆయా నేతల్లో రిజర్వేషన్ల భయం పట్టుకుంది. ఏ రిజర్వేషన్ వస్తదో అని చర్చించుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాల్లో 1,684 గ్రామపంచాయతీలు ఉండగా.. 23,22,054 మంది పల్లెల్లో ఓటర్లు ఉన్నారు. 74 ZPTC స్థానాలతో పాటు 19 పురపాలికలున్నాయి.

News July 11, 2025

రాజంపేట: యువకుల మిస్సింగ్‌పై పవన్‌కు ఫిర్యాదు

image

రాజంపేటకు చెందిన ముగ్గురు యువకులు థాయిలాండ్‌లో ఉద్యోగానికి వెళ్లి అదృశ్యమయ్యారు. వాళ్ల అచూకీ కనిపెట్టాలని రాజంపేటకు చెందిన పూజారి గిరిజా కుమారి అనే మహిళ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌ను కోరారు. ఆయనకు యువకుల వివరాలు అందజేశారు. మహిళ ఫిర్యాదుతో డిప్యూటీ సీఎం కేంద్రంతో మాట్లాడారు. రాజంపేటలోని ఎస్వీ నగర్‌కు చెందిన ఓ యువకుడితో మరో ఇద్దరు 3నెలల కిందట థాయిలాండ్ వెళ్లగా వాళ్ల ఆచూకీ లభించలేదు.