News March 15, 2025

నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

☞ ఆళ్లగడ్డలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
☞ అహోబిలంలో చీఫ్ సెక్రటరీ ప్రత్యేక పూజలు
☞ గోస్పాడు మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత
☞ సంజన్న హత్య.. కంటతడి పెట్టిన ఎంపీ శబరి
☞ నందికొట్కూరులో భార్యను హతమార్చిన భర్త
☞ కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష
☞ నంద్యాలలో అధిక ధరలకు స్టాంపులు దందా
☞ పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
☞ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమం

Similar News

News March 16, 2025

ఒత్తిడిని అధిగమించి పరీక్షలు రాయండి: గొట్టిపాటి

image

రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదివారం శుభాకాంక్షలు చెప్పారు. విద్యార్థులు ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయాలని సూచించారు. జీవితంలో ఉన్నత చదువులకు తొలి మెట్టు పదవ తరగతి అన్నారు. ప్రతి ఒక్కరూ గొప్ప ఫలితాలు సాధించాలని ఆకాంక్షించారు.

News March 16, 2025

ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ దివాళా తీయించారు: సీఎం రేవంత్

image

TG: గత ప్రభుత్వం రూ.8 లక్షల కోట్లకు పైగా అప్పును తమపై పెట్టి పోయిందని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని KCR దివాళా తీయించారని దుయ్యబట్టారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో ఉమ్మడి వరంగల్ పాత్ర మరువలేనిదని తెలిపారు. దొడ్డి కొమురయ్య, సర్వాయ్ పాపన్న, జయశంకర్ సర్ వంటి వాళ్లు ఎప్పటికీ గుర్తుండిపోయే మహనీయులని అన్నారు.

News March 16, 2025

BRS రంగుల ప్రపంచాన్ని మాత్రమే చూపించింది: సీతక్క

image

సీఎం రేవంత్ రెడ్డి నిర్వహించిన భారీ బహిరంగ సభలో మంత్రి సీతక్క మాట్లాడారు. కాంగ్రెస్ అంటేనే సంక్షేమం అన్నారు. గత 10 సంవత్సరాలలో కేవలం రంగుల ప్రపంచాన్ని మాత్రమే BRS చూపించింది.. కానీ అభివృద్ధి చేయలేదని విమర్శించారు. ప్రజా పాలనలో సామాన్య ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రతిపక్ష నాయకులు ఓర్వలేక పోతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అంటేనే మహిళలను అణగ తొక్కడం అని ఆరోపించారు.

error: Content is protected !!