News March 15, 2025

నంద్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

☞ ఆళ్లగడ్డలో లారీ ఢీకొని వ్యక్తి దుర్మరణం
☞ అహోబిలంలో చీఫ్ సెక్రటరీ ప్రత్యేక పూజలు
☞ గోస్పాడు మండలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రత
☞ సంజన్న హత్య.. కంటతడి పెట్టిన ఎంపీ శబరి
☞ నందికొట్కూరులో భార్యను హతమార్చిన భర్త
☞ కలెక్టరేట్లో తాగునీటి సరఫరాపై మంత్రుల ఉన్నత స్థాయి సమీక్ష
☞ నంద్యాలలో అధిక ధరలకు స్టాంపులు దందా
☞ పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం
☞ జిల్లా వ్యాప్తంగా స్వచ్ఛతా కార్యక్రమం

Similar News

News October 14, 2025

చోడవరంలో 275 కిలోల గంజాయి పట్టివేత

image

చోడవరం వద్ద పోలీసులు 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, అల్లూరి జిల్లా తర్లగూడకు చెందిన వంతల దేవదాస్ ఒడిశా చిత్రకొండ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్‌కు తరలించేందుకు యత్నించాడు. ఎనిమిది సంచుల్లో ప్యాక్ చేసిన గంజాయి, కారు, రెండు బైక్‌లు, ఐదు ఫోన్లు స్వాధీనం. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.

News October 14, 2025

సకాలంలో స్పందించిన విశాఖ పోలీసులు

image

కంచరపాలెంకు చెందిన యువతి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించగా మహారాణిపేట పోలీసులు కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కంచరపాలెంలో నివాసం ఉంటున్న యువతి ఇంట్లో కలహాల కారణంగా ఎవరికి చెప్పకుండా ఆర్కే బీచ్‌కి వచ్చి చనిపోవడానికి ప్రయత్నించింది. ఇదే సమయంలో కుటుంబ సభ్యులు112కు ఫిర్యాదు చేయడంతో వెంటనే సీఐ దివాకర్ యాదవ్ స్పందించి గాలింపు చేపట్టగా బీచ్ రోడ్లో సాగర్ తీరం వద్ద ఉన్న యువతని కాపాడారు.

News October 14, 2025

నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు!

image

AP: కోస్తాంధ్ర, దక్షిణ తమిళనాడును ఆనుకొని బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనాలు ఏర్పడినట్లు వాతావరణశాఖ తెలిపింది. దీంతో ఇవాళ ఏలూరు, కృష్ణా, NTR, పల్నాడు, GNT జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని వాతావరణశాఖ అంచనా వేసింది. మిగతా జిల్లాల్లోనూ భారీ వానలు పడే ఛాన్స్ ఉందని వెల్లడించింది. మరో 4 రోజులు కోస్తా, రాయలసీమల్లో ఎక్కువ చోట్ల వర్షాలు, కొన్నిచోట్ల భారీ వర్షాలకు ఛాన్స్ ఉందని చెప్పింది.