News March 27, 2024
నంద్యాల జిల్లాలో 28న CM, 29న మాజీ CM పర్యటన

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన వేళ YCP, TDP అగ్రనేతలు గెలుపే ప్రధాన ఏజెండాగా పావులు కదుపుతున్నారు. ఈనెల 28న CM వైఎస్ జగన్ నంద్యాలలో ‘మేమంతా సిద్ధం’ పేరిట బస్సు యాత్ర చేపడుతుండగా, మరోవైపు మాజీ CM నారా చంద్రబాబు ఈనెల 29న ‘ప్రజాగళం’ పేరిట బనగానపల్లెలో పర్యటించనున్నారు. ఈ క్రమంలో YCP, TDP అధినేతలు జగన్, చంద్రబాబు తమ పార్టీ శ్రేణులలో వరుస కార్యక్రమాలతో నూతన ఉత్సాహాన్ని నింపనున్నారు.
Similar News
News March 18, 2025
ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

రహదారుల్లో ప్రమాదాలు జరగకుండా పటిష్ఠమైన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ట్రాఫిక్ రూల్స్ పాటించకపోవడం, వాహనాలను ఓవర్ టేక్ చేయడం, హెల్మెట్ ధరించకపోవడం వంటి కారణాలతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, వాటిపై అవగాహన కల్పించాలన్నారు.
News March 18, 2025
దేవనకొండ: శ్రీ గద్దరాల మారెమ్మవ్వ చరిత్ర

కర్నూలు జిల్లా దేవనకొండ మండల సమీపానికి 5 కిలోమీటర్ల దూరంలో కొండల్లో వెలిసిన శ్రీ గద్దరాల మారమ్మ అవ్వ మూడేళ్లకొకసారి జరిగే ఊరు దేవురా కుంభోత్సవానికి ఒక ప్రత్యేకత ఉంది. పక్కనున్న పల్లె దొడ్డి గ్రామం నుంచి 101 కుంభాలతో గద్దరాల మారెమ్మవా దేవాలయం చేరుకునే సమయంలో అమ్మవారు గద్ద రూపంలో దేవాలయం వెనకాల ఉన్న కొండపై వాలి వెళ్లిపోతుందని అక్కడి గ్రామస్థులు పురాణాలు చెబుతున్నారు.
News March 18, 2025
జొన్నగిరి ఎస్ఐ జయశేఖర్ బదిలీ

తుగ్గలి మండలం జొన్నగిరి ఎస్ఐగా విధులు నిర్వర్తించిన జయశేఖర్ ను బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఆయన స్థానంలో కర్నూలు DSBలో ఉన్న మల్లికార్జునను జొన్నగిరి ఎస్ఐగా నియమించారు. జయశేఖర్ ను ఆదోని 3టౌన్ ఎస్ఐగా పోస్టింగ్ ఇచ్చారు. మండలంలో శాంతిభద్రతలను కాపాడడంలో జయశేఖర్ ఎంతో కృషి చేశారని మండల ప్రజలు తెలిపారు.