News March 19, 2025

నంద్యాల జిల్లాలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు

image

నంద్యాల జిల్లాలో మంగళవారం రికార్డు స్థాయి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా బండి ఆత్మకూరు, పెద్ద దేవళాపురంలో 42.7°C, చాగలమర్రిలో 42.4°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మరోవైపు పలు మండలాల్లో తీవ్ర వడగాల్పులు వీచాయి. గోస్పాడు 41.9°, దొర్నిపాడు 41.7° ఆత్మకూరు 41.5°, కొత్తపల్లి 41.4°, పగడ్యాల మండలాల్లో 41.1° ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Similar News

News November 21, 2025

BREAKING: జనగామ: ఏసీబీకి చిక్కిన మిషన్ భగీరథ DEE

image

జనగామ జిల్లా పాలకుర్తి మిషన్ భగీరథ డీఈఈ కూనమల్ల సంధ్యారాణి రూ.10 వేల లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అధికారులకు చిక్కింది. ఓ బాధితుడి వద్ద బిల్లు విషయమై రూ.10,000 లంచం అడగడంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News November 21, 2025

సిద్దిపేట: ప్రతి వాహనదారుని ప్రాణాలు ముఖ్యం: కలెక్టర్

image

సిద్దిపేట జిల్లాలో వివిధ రోడ్లపై ప్రయాణిస్తున్న ప్రతి వాహనదారుని ప్రాణాలు ముఖ్యమని పగడ్బందీగా రోడ్ భద్రత చర్యలు చేపట్టాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని కాన్ఫరెన్స్ హల్‌లో రోడ్డు భద్రత కమిటీ, మత్తు పదార్థాల వినియోగ నివారణకు సంబంధించి అన్ని శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు.

News November 21, 2025

వరంగల్: భారీగా పడిపోతున్న మొక్కజొన్న ధర

image

వరంగల్ ఎనుమాముల మార్కెట్‌లో మొక్కజొన్న ధర భారీగా పడిపోతోంది. గతవారం రూ.2,100 పలికిన మక్కలు ధర ఈవారం మొదటి నుంచి క్రమంగా తగ్గుతూ వస్తోంది. సోమవారం రూ.2,080 ఉన్న మొక్కజొన్న ధర, బుధవారం రూ.2,030కి పడిపోయింది. ఈరోజు మరింత తగ్గి రూ.2,010 అయింది. దీంతో రైతులు ఆవేదన చెందుతున్నారు. అలాగే మార్కెట్‌లో కొత్త తేజ మిర్చికి రూ.15,021 ధర రాగా, దీపిక మిర్చికి రూ.16 వేల ధర వచ్చింది.