News March 1, 2025

నంద్యాల జిల్లాలో 50% పంపిణీ పూర్తి

image

నంద్యాల జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రభుత్వం ఆదేశాలతో తొలిసారిగా ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కాగా.. ఉ.9:30 గంటలకు నంద్యాల జిల్లాలో 59.41% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా, ఇప్పటివరకు జిల్లాలో 2,15,031 మందికి గానూ 1,27,746 మందికి సచివాలయ ఉద్యోగులు పింఛన్ సొమ్మును అందజేశారు.

Similar News

News January 4, 2026

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ADB కమిటీ ఎన్నిక

image

తెలంగాణ స్టేట్ ఛాంబర్ అఫ్ కామర్స్ అండ్ ట్రేడ్స్ ఆదిలాబాద్ జిల్లా నూతన కమిటీని ఆదివారం ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివప్రసాద్ రెడ్డి, ఉపాధ్యక్షుడిగా తోట భాస్కర్, కోశాధికారిగా జాబు రాజు లను నియమించినట్లు ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు జగదీష్ అగర్వాల్, రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపెళ్లి శివప్రసాద్ తెలిపారు. సంఘం బలోపేతంతో పాటు వ్యాపారస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వారు పేర్కొన్నారు.

News January 4, 2026

రాంబిల్లి: అగ్ని ప్రమాదంపై కేసు నమోదు

image

రాంబిల్లి మండలం లాలంకోడూరు ఎస్.వీ.ఎస్. ఫార్మా కంపెనీలో శనివారం జరిగిన అగ్ని ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు సీఐ నర్సింగరావు ఆదివారం తెలిపారు. కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించి తగిన జాగ్రత్తలు తీసుకోపోవడం వల్లే ప్రమాదం జరిగిందని వీఆర్ఓ ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

News January 4, 2026

నా అన్వేష్‌ కేసులో కొత్త సెక్షన్లు

image

TG: నటి, BJP నేత కరాటే కళ్యాణి ఫిర్యాదుతో యూట్యూబర్ <<18721474>>నా అన్వేష్‌<<>>పై పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆ FIRలో మరిన్ని సెక్షన్స్ జోడించాలని ఆమె పోలీసులను కోరారు. ‘అన్వేష్ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు. అతడో దేశద్రోహి. మొన్నటి FIRలో IT సెక్షన్ 69(A) కూడా చేర్చాలని రిప్రజెంటేషన్ ఇచ్చాం. అతడి యూట్యూబ్ ఛానల్ బ్యాన్ చేయాలని, బ్యాంక్ అకౌంట్ ఫ్రీజ్ చేయాలని కోరాం’ అని తెలిపారు.