News April 4, 2025

నంద్యాల జిల్లాలో 8 మంది ఎస్సైలు బదిలీ!

image

నంద్యాల జిల్లాలో VRలో పనిచేస్తున్న పలువురు SIలను బదిలీ చేస్తూ గురువారం జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఎం.రామస్వామిని నంద్యాల 3 టౌన్‌కు, ఎ.అమ్జద్ అలీని డోన్ రూరల్, బి.శ్రీనివాసరావును నంద్యాల డీసీఆర్ బీకి బదిలీ చేశారు. మరింకొందరిలో శ్రీనివాసులును నంద్యాల PCRకు, తిరుపాల్‌ను బేతంచర్ల, గోపాల్‌ను కొలిమిగుండ్లకు, జగన్నాథ్‌ను డోన్ అర్బన్‌కు, మహమ్మద్‌ని నంద్యాల తాలూకాకు బదిలీ చేశారు.

Similar News

News November 15, 2025

ఖమ్మం: కానిస్టేబుల్ సూసైడ్

image

ఖమ్మం పోలీస్ హెడ్ క్వార్టర్స్‌లో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న ధారావత్ బాలాజీ (38) శుక్రవారం ఎదులాపురం సింహద్రినగర్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొంతకాలం క్రితం రోడ్డు ప్రమాదంలో తలకు బలమైన గాయం కావడంతో ఆయన సెలవుపై ఇంట్లోనే ఉంటున్నారు. గాయాల కారణంగా మనస్తాపం చెంది బాలాజీ ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. రూరల్ సీఐ రాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 15, 2025

బ్యాంకుల విలీనం మంచిదే: SBI ఛైర్మన్

image

ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం మంచిదేనని SBI ఛైర్మన్ శ్రీనివాసులు శెట్టి అభిప్రాయపడ్డారు. ‘మరోసారి విలీనాలు జరిగినా ఆశ్చర్యం లేదు. ఇంకా కొన్ని చిన్న బ్యాంకులున్నాయి. అమెరికా విధించిన అదనపు టారిఫ్‌లతో మన దేశ ఎగుమతులపై ప్రభావం పడినప్పటికీ ఏ రంగం నుంచి SBIకి సమస్యలు ఎదురుకాలేదు. ఎక్స్‌పోర్ట్ చేసేవారికి సపోర్ట్ కొనసాగుతుంది. మార్కెట్ వాటా పొందే విషయంలో రాజీపడడం లేదు’ అని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

News November 15, 2025

గుంటూరు మిర్చీ యార్డులో 40,026 టిక్కీలు అమ్మకం

image

గుంటూరు మిర్చి యార్డుకు శుక్రవారం 34,160 మిర్చి టిక్కీలు విక్రయానికి వచ్చాయని గుంటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉన్నతశ్రేణి కార్యదర్శి చంద్రిక తెలిపారు. ముందురోజు నిల్వ ఉన్న వాటితో కలిపి 40,026 అమ్మకం జరిగాయని ఇంకా యార్డు ఆవరణలో 7,698 మిర్చి టిక్కీలు నిల్వ ఉన్నట్లు ఆమె పేర్కొన్నారు. వివిధ రకాల మిరపకాయలకు ధరలు పలు విధాలుగా నమోదయ్యాయన్నారు.