News April 4, 2025
నంద్యాల జిల్లాలో 8 మంది ఎస్సైలు బదిలీ!

నంద్యాల జిల్లాలో VRలో పనిచేస్తున్న పలువురు SIలను బదిలీ చేస్తూ గురువారం జిల్లా SP అధిరాజ్ సింగ్ రాణా ఉత్తర్వులు జారీ చేశారు. ఎం.రామస్వామిని నంద్యాల 3 టౌన్కు, ఎ.అమ్జద్ అలీని డోన్ రూరల్, బి.శ్రీనివాసరావును నంద్యాల డీసీఆర్ బీకి బదిలీ చేశారు. మరింకొందరిలో శ్రీనివాసులును నంద్యాల PCRకు, తిరుపాల్ను బేతంచర్ల, గోపాల్ను కొలిమిగుండ్లకు, జగన్నాథ్ను డోన్ అర్బన్కు, మహమ్మద్ని నంద్యాల తాలూకాకు బదిలీ చేశారు.
Similar News
News November 3, 2025
టంగుటూరు: తోపులాటలో అల్లుడి మృతి

టంగుటూరు శ్రీనివాసనగర్కు చెందిన దివ్యకీర్తితో వంశీకి ఆరేళ్ల కిందట వివాహమైంది. వంశీ హైదరాబాద్లో సాప్ట్వేర్ జాబ్ కావడంతో అక్కడ కాపురం పెట్టారు. ఇటీవల భర్తతో గొడవపడి దివ్య తన ఇద్దరు బిడ్డలతో టంగుటూరులోని పుట్టింటికి వచ్చింది. వంశీ ఆదివారం భార్య ఇంటికి వచ్చి బంధువులతో రాజీకి ప్రయత్నించారు. ఈక్రమంలో తోపులాట జరిగి వంశీ కిందపడి స్పృహ కోల్పోయాడు. ఆసుపత్రికి తీసుకెళ్లగా చనిపోయాడని నిర్ధారించారు.
News November 3, 2025
APPLY NOW: అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు

యూనివర్సిటీ ఆఫ్ కాలికట్ 4 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 15వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి ఎంటెక్, పీహెచ్డీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు. మరింత సమాచారం కోసం వెబ్సైట్: https://uoc.ac.inను సంప్రదించండి.
News November 3, 2025
SRSP UPDATE: 24 గంటల్లో 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో

గడిచిన 24 గంటల్లో SRSPలోకి ఎగువ ప్రాంతాల నుంచి 56,514 క్యూసెక్కుల ఇన్ ఫ్లో రాగ అంతే మొత్తం నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు సోమవారం ఉదయం తెలిపారు. 16 స్పిల్ వే గేట్ల ద్వారా 47,060 క్యూసెక్కుల నీటిని వదిలామన్నారు. కాగా ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 80.501 TMCలకు గాను తాజాగా పూర్తి స్థాయిలో నీరు నిల్వ ఉందని అధికారులు పేర్కొన్నారు.


