News April 1, 2025

నంద్యాల జిల్లాలో 84.63% పెన్షన్ల పంపిణీ

image

ఎన్టీఆర్ భరోసా పథకం కింద నంద్యాల జిల్లాలో సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శరవేగంగా కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 12:10 గంటల సమయానికి నంద్యాల జిల్లాలో 84.63% పింఛన్ల పంపిణీ పూర్తయింది. కాగా ఇప్పటివరకు జిల్లాలో 2,14,590 మందికి గాను, 1,81,608 మందికి సచివాలయ ఉద్యోగులు పెన్షన్ సొమ్మును అందజేశారు.

Similar News

News January 1, 2026

ఆపరేషన్ స్మైల్–12 విజయవంతం చేయాలి: ASF ఎస్పీ

image

బాల కార్మిక వ్యవస్థను సమూలంగా నిర్మూలించడమే లక్ష్యంగా చేపట్టిన ఆపరేషన్ స్మైల్–12ను విజయవంతం చేయాలని జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆదేశించారు. జిల్లావ్యాప్తంగా హోటళ్లు, షాపులు, ఇటుక బట్టీలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి బాల కార్మికులను గుర్తించి రక్షించాలన్నారు. పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. వివరాలు తెలిసిన వారు 100 లేదా 1098కు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 1, 2026

చిత్తూరు కలెక్టరేట్‌లో మాసోత్సవాల పోస్టర్ ఆవిష్కరణ

image

రహదారిపై ప్రయాణించేటప్పుడు ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలు పాటించాలని కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలెక్టరేట్ లో రవాణా శాఖ జిల్లా అధికారి నిరంజన్ రెడ్డితో కలిసి ‘జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన గోడపత్రికలు, కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ మాసం ఉత్సవాలు ఈనెల 31వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ప్రతి ఒక్కరూ రహదారి నిబంధనలను విధిగా పాటించాలని విజ్ఞప్తి చేశారు.

News January 1, 2026

శాతవాహన వర్సిటీ యూజీసీ అఫైర్స్ డైరెక్టర్‌గా సుజాత

image

కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయ యూజీసీ అఫైర్స్ సంచాలకులుగా సమాజశాస్త్ర విభాగాధిపతి ఆచార్య ఎస్. సుజాత నియమితులయ్యారు. గురువారం వీసీ కార్యాలయంలో ఉపకులపతి ఆచార్య యు. ఉమేష్ కుమార్ చేతుల మీదుగా ఆమె నియామక పత్రం అందుకున్నారు. రిజిస్ట్రార్ జాస్తి రవికుమార్, ఓఎస్డీ హరికాంత్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. గతంలో ఆమె ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపల్‌గా, అడ్మిషన్ల విభాగం డైరెక్టర్‌గా సేవలందించారు.