News July 25, 2024
నంద్యాల జేసీగా విష్ణు చరణ్ బాధ్యతలు

నంద్యాల జిల్లా నూతన జాయింట్ కలెక్టర్గా 2019 బ్యాచ్ IAS అధికారి సి.విష్ణు చరణ్ కలెక్టరేట్ కార్యాలయంలోని జాయింట్ కలెక్టర్ ఛాంబర్లో బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తొలుత కలెక్టరేట్ చేరుకున్న నూతన జేసీ విష్ణు చరణ్కు డీఆర్ఓ పద్మజ స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలు చేపట్టారు. రెవెన్యూ, సంక్షేమ పథకాల అమలు, ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని JC తెలిపారు.
Similar News
News November 16, 2025
కర్నూలు: రేపు ‘డయల్ యువర్ APSPDCL CMD’

విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ‘డయల్ యువర్ APSPDCL CMD’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సీఎండీ శివశంకర్ తెలిపారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం సహా తొమ్మిది జిల్లాల వినియోగదారులు 8977716661 నంబరుకు కాల్ చేసి తమ సమస్యలు చెప్పవచ్చని ఆయన పేర్కొన్నారు.
News November 16, 2025
కర్నూలు: 675 మందిపై కేసులు

జనవరి-అక్టోబర్ వరకు జిల్లా వ్యాప్తంగా నిబంధనలు ఉల్లంఘించి వాహనాలు నడిపిన 675 మంది మైనర్లపై కేసులు నమోదు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని తల్లిదండ్రులకు సూచించారు. మొదటిసారి పట్టుబడితే హెచ్చరికతో దండిస్తామని, రెండోసారి అయితే రూ.5 వేల జరిమానా విధిస్తున్నామని చెప్పారు. మద్యం తాగి డ్రైవింగ్ చేసిన మైనర్లతో పాటు వాహన యజమానులపైనా కేసులు నమోదవుతాయని హెచ్చరించారు.
News November 16, 2025
అంగన్వాడీల్లో పిల్లలకు పోషకాహారం అందించాలి: కలెక్టర్ సిరి

అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు పోషకాహార లోపం లేకుండా చూడాలని సీడీపీఓలను కర్నూలు జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి వీడియో కాన్ఫరెన్స్లో ఆదేశించారు. ఉదయం 9 గంటలకు కేంద్రాలు తెరచి, పిల్లల ఎత్తు, బరువు ప్రమాణాలను ఎప్పటికప్పుడు తనిఖీ చేయాలన్నారు. తల్లులకు ఇంటింటికీ వెళ్లి అవగాహన కల్పించాలని, వాట్సాప్ గ్రూపుల ద్వారా పోషకాహారంపై వీడియోలు పంపాలని ఆమె సూచించారు.


