News April 4, 2024

నంద్యాల: తనిఖీలలో రూ.91 లక్షల నగదు స్వాధీనం

image

బనగానపల్లె మండలం పసుపుల గ్రామం వద్ద గురువారం తెల్లవారుజామున వాహనాల తనిఖీలో రూ. 91 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి తెలిపారు. డోన్ డీఎస్పీ శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు సీఐ, పోలీసులు తనిఖీ చేయగా లారీలో ఒక బాక్సులో రూ. 91 లక్షలు నగదు గుర్తించారు. డ్రైవర్ సయ్యద్ మహబూబ్ బాషా బెంగళూరు నుంచి లారీని తీసుకొస్తుండగా సరైన పత్రాలు లేకపోవడంతో నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

Similar News

News October 27, 2025

చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు: SP

image

చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ అన్నారు. ఆదివారం జిల్లాలో నేరనియంత్రణ, శాంతిభద్రత కోసం అన్ని పోలీస్ స్టేషన్లలో రౌడీ, నేరచరిత్ర కలిగిన వ్యక్తులకు కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించండి, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.

News October 26, 2025

వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News October 26, 2025

వర్గీకరణ మార్కింగ్ 29లోపు పూర్తి కావాలి: జిల్లా కలెక్టర్

image

భూ కమతాల వర్గీకరణ మార్కింగ్ ప్రక్రియను ఈనెల 29వ తేదీలోపు పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ సిరి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఆదివారం మండల, డివిజన్ వ్యవసాయ శాఖ అధికారులతో భూకమతాల వర్గీకరణ, ఈ పంట నమోదు, పత్తి, ఉల్లి పంటల హార్వెస్టింగ్‌పై కలెక్టర్ టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. గడువులోగా ఈ పంట నమోదు కూడా పూర్తి కావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.