News June 25, 2024
నంద్యాల: నకిలీ బంగారం పెట్టి.. బ్యాంక్ లోన్

నకిలీ బంగారంతో రూ.6.66లక్షల లోన్ తీసుకుని మోసిగించిన ఘటనపై కేసు నమోదైంది. ఎస్సై వరప్రసాద్ వివరాలు..ఉయ్యాలవాడ(M) మాయలూరుకు చెందిన లక్ష్మీనారయణ కోవెలకుంట్ల ముత్తూట్ ఫైనాన్స్లో 8నకిలీ బంగారు గాజులు తాకట్టుపెట్టి రూ.2.63లక్షలు, సంజామల(M) పేరుసోములకి చెందిన అమీర్ 4గాజులు, కడియం తాకట్టు పెట్టి రూ.3.03లక్షల రుణం తీసుకున్నారు. ఆడిట్లో 10శాతం మాత్రమే బంగారం ఉన్నట్లు తేలడంతో మేనేజర్ psలో ఫిర్యాదు చేశారు.
Similar News
News October 15, 2025
పీఎం పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదు: సీఎం

ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనలో ఎలాంటి పొరపాట్లు జరగకూడదని జిల్లా అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుధవారం విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కర్నూలు కమాండ్ కంట్రోల్ నుంచి కలెక్టర్ సిరి, పీఎం ప్రోగ్రాం కోఆర్డినేటర్ వీరపాండ్యన్, జిల్లా అధికారులు పాల్గొన్నారు. వేదిక వద్ద భద్రత, పార్కింగ్, నీటి సదుపాయాలు కల్పించాలని సీఎం సూచించారు.
News October 15, 2025
ప్రధాని పర్యటన సాఫీగా నిర్వహించాలి: డీజీపీ

ప్రధాని మోదీ పర్యటన సాఫీగా నిర్వహించాలని డీజీపీ హరీశ్ కుమార్ గుప్త పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ప్రధాని పర్యటన సాఫీగా, ప్రశాంతంగా సాగేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. రోడ్ షోలు, బహిరంగ సభల్లో భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.