News July 3, 2024

నంద్యాల నూతన కలెక్టర్ ప్రస్థానం

image

నంద్యాల జిల్లా నూతన కలెక్టర్‌గా బీ.రాజకుమారి నియమితులయ్యారు. శ్రీకాకుళం (D) టెక్కలి మండలం కొల్లివలస ఆమె స్వస్థలం. 2009 గ్రూప్‌-1 అధికారి అయిన ఈమె విజయనగరం ఆర్డీవోగా ఎంపికయ్యారు. 2013లో సింహాచలం దేవస్థానం స్పెషల్ డీసీగా, 2017లో తూ.గోలో డ్వామా పీడీగా, 2019లో అదే జిల్లాకు JC(వెల్ఫేర్)గా పని చేశారు. 2021లో IAS హోదా పొందారు. ప్రస్తుతం గుంటూరు JCగా ఉన్న ఈమె నంద్యాల కలెక్టర్‌గా బదిలీ అయ్యారు.

Similar News

News September 20, 2024

587 మొబైల్స్ రికవరీ: ఎస్పీ

image

కర్నూలు జిల్లా పరిధిలో రూ.1,33,70,000 విలువ చేసే 587 మొబైల్స్‌ను ఎస్పీ బిందు మాధవ్ బాధితులకు అందజేశారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం మొబైల్ రికవరీ మేళా నిర్వహించారు. మొబైల్ పోగొట్టుకున్న వారికి రికవరీ చేసి అందజేసినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఎలాంటి రుసుము లేకుండా అందజేశామన్నారు. పోలీస్ సేవలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.

News September 20, 2024

ముచ్చట్ల ఆలయ పూజారి కుమార్తెకు MBBSలో సీటు

image

బేతంచెర్ల మండలం రంగాపురానికి చెందిన ముచ్చట్ల ఆలయ పూజారి చంద్రమోహన్ రావు, వరలక్ష్మీ దంపతుల కుమార్తె ఇందు ప్రసన్నలక్ష్మీ కర్నూలు మెడికల్ కళాశాలలో MBBS సీటు సాధించింది. నీట్ ఫలితాల్లో 720 మార్కులు గాను 644 మార్కులు సాధించింది. గ్రామీణ విద్యార్థికి MBBSలో సీటు రావడం పట్ల గ్రామస్థులుచ తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.

News September 20, 2024

నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రజా వేదికలు: కలెక్టర్

image

ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సాధించిన విజయాలపై నేటి నుంచి 26వ తేదీ వరకు ప్రజా వేదికలు నిర్వహించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. సచివాలయ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కరపత్రాలు, డోర్ స్టిక్కర్లను అందజేసి, కరపత్రంలోని విషయాలను ప్రజలకు వివరిస్తారని తెలిపారు.