News May 25, 2024

నంద్యాల: నెల రోజులపాటు ఈ రెండు రైళ్లు రద్దు

image

గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో ట్రాక్ పనుల మరమ్మతుల పనుల కారణంగా రైళ్ల రద్దు మరికొంత కాలం పొడిగిస్తూ రైల్వే ఉన్నాతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారని డోన్ రైల్వేస్టేషన్ మేనేజర్ జి.వేంకటేశ్వర్లు తెలిపారు. గుంటూరు నుంచి డోన్(17228) రైలు, హుబ్బళ్లి నుంచి విజయవాడు(17329) జూన్ 30వ తేదీవరకు రద్దు చేసినట్లు పేర్కొన్నారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించి రైల్వే వారికి సహకరించాలని కోరారు.

Similar News

News November 7, 2025

జాతీయ స్థాయి క్రికెట్‌కు మద్దికేర విద్యార్థి ఎంపిక

image

మద్దికేరకు చెందిన కాలువ శ్రీరాములు, లక్ష్మీ కుమారుడు యువరాజు ఫాస్ట్ బౌలర్‌గా జాతీయ స్థాయి క్రికెట్‌కు ఎంపికయ్యాడు. ఈ మేరకు ఆయన తల్లిదండ్రులు గురువారం తెలిపారు. ఇటీవల శ్రీకాకుళంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 విభాగంలో మంచి ప్రదర్శన చూపడంతో జాతీయ స్థాయికి ఎంపికయ్యాడు. యువరాజ్ ఇంటర్ చదువుతున్నాడు. కరస్పాండెంట్ యజ్ఞం మాధవ్, ప్రిన్సిపల్ సునీత, గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

News November 7, 2025

SUPER.. కర్నూలు ప్రిన్సిపల్‌కు 43 అవార్డులు

image

కర్నూలు బి క్యాంప్ ప్రభుత్వ వొకేషనల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎస్.నాగస్వామి నాయక్ విద్యా, సేవా రంగాల్లో చేసిన విశిష్ఠ కృషికి యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ (UNO) ప్రశంసా పత్రం అందుకున్నారు. ఈ అవార్డును గురువారం కర్నూలు ఎంపీ నాగరాజు చేతుల మీదుగా స్వీకరించారు. నాయక్ ఇప్పటివరకు 43 జాతీయ, అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు. కళాశాల ఉత్తీర్ణత శాతం 82.08% సాధించడంలో కీలక పాత్ర వహించారు.

News November 7, 2025

విద్యార్థులు భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి: ఎస్పీ

image

ఆటోలు కళాశాలల స్కూల్ బస్సుల్లో విద్యార్థులను, ప్రజలను పరిమితికి మించి ఎక్కించుకొని ప్రయాణించరాదని ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్పష్టంచేశారు. గురువారం ఆటో డ్రైవర్లకు ట్రాఫిక్ రూల్స్‌పై పోలీసులు కౌన్సెలింగ్ ఇచ్చారు. కళాశాలలు, స్కూల్ యాజమాన్యాలకు నోటీసులు జారీ చేశారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ ఫోన్ వాడటం, రోడ్ల వెంట ఆటోలను నిలపడం, మద్యం తాగి వాహనాలు నడిపడం వంటికి చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.