News January 27, 2025
నంద్యాల నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

నంద్యాలలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. సోమవారం పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య ఎంపిక పోటీలు ఉన్నందున సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అర్జీదారులు గుర్తించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావద్దని సూచించారు.
Similar News
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.
News November 26, 2025
PHOTO OF THE జీహెచ్ఎంసీ హిస్టరీ

GHMC చరిత్రలో తొలిసారి నూతన ఒరవడికి మేయర్ గద్వాల విజయలక్ష్మీ నిర్ణయం తీసుకున్నారు. బల్దియాతో ఈ 5 ఏళ్ల ప్రయాణానికి తీపి గుర్తుగా సభ్యులందరూ బ్రేక్ సమయంలో గ్రూప్ ఫొటో తీసుకున్నారు. దీనికి GHMC ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది. కౌన్సిల్ హాల్లో LEDతో కూడిన GHMC నేమ్ బోర్డును సైతం అమర్చారు. ఈ ఏడాది నుంచే కొత్త ఒరవడికి నాంది పలికారు. ఈ ఫొటోను కౌన్సిల్ హాల్లో ఏర్పాటు చేయనున్నారు.
News November 26, 2025
బాపట్లకు చేరుకున్న షారద్ ఆహేర్

కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్ PCC ప్రెసిడెంట్ షారద్ అహర్ మంగళవారం బాపట్ల జిల్లాకు చేరుకున్నారు. గన్నవరం విమానశ్రయంలో ఆ పార్టీ బాపట్ల జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మార్పు గ్రేగోరి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకే అందజేశారు. బుధవారం జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు పార్టీ బలోపేతానికి కృషి చేయడానికి దిశా నిర్దేశం చేయనున్నట్లు చెప్పారు.


