News January 27, 2025
నంద్యాల నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు

నంద్యాలలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరగనున్న ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. సోమవారం పోలీస్ కానిస్టేబుల్ దేహదారుఢ్య ఎంపిక పోటీలు ఉన్నందున సోమవారం జరిగే ఈ కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు చెప్పారు. ఈ విషయాన్ని అర్జీదారులు గుర్తించి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావద్దని సూచించారు.
Similar News
News February 19, 2025
పరిగి: కరెంట్ పోల్కు ఉరేసుకొని సూసైడ్

పరిగిలో విషాదం ఘటన వెలుగుచూసింది. స్థానికుల వివరాలు.. నజీరాబాద్ తండాకు చెందిన భారతి పరిగి మండలం హనుమాన్ గండి సమీపంలో ఉన్న కరెంట్ పోల్కు ఉరేసుకుంది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సూసైడ్కు గల కారణాలు తెలియాల్సి ఉంది.
News February 19, 2025
గుంటూరులో కర్నూలు జిల్లా వ్యక్తి మృతి

బతుకుదెరువు కోసం వలస వెళ్లిన కర్నూలు జిల్లా వ్యక్తి గుంటూరులో మృతిచెందాడు. అందిన వివరాల మేరకు.. కౌతాళం మండలం సులకేరి గ్రామానికి చెందిన నాగేశ్ (28) జనవరిలో ఉపాధి కోసం వలస వెళ్లారు. ఇవాళ ఉదయం పనులకు పోతుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి కింద పడ్డారు. తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడికి భార్య, కుమార్తె ఉన్నారు.
News February 19, 2025
ఇవాళ అంతర్జాతీయ ‘టగ్ ఆఫ్ వార్’ డే

రెండు జట్లు తాడు లాగుతూ పోటీపడే ఆటను టగ్ ఆఫ్ వార్ అంటారు. రెండు జట్ల మధ్య ఒక గీతను గీసి తాడు లాగడంపై పోటీ నిర్వహిస్తారు. ఎనిమిది మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఈ పోటీలో పాల్గొనవచ్చు. ప్రత్యర్థి జట్టును గీత తాకేలా ఎవరైతే లాగుతారో వారే విజేతగా నిలుస్తారు. సరదా కోసం ఆడే ఈ ఆట 1900 నుంచి 1920 వరకు ఒలింపిక్స్లో కూడా ఉంది. ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ ఆట ఆడుతుంటారు. మీరూ ఎప్పుడైనా ఆడారా?