News March 24, 2025
‘నంద్యాల నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలి’

నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదేశాల మేరకు జిల్లాలో నేర నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లా పోలీసు అధికారులు అన్ని పోలీసు స్టేషన్ల పరిధిలలో రౌడీ షీటర్లకు, నేరచరిత్ర గలవారికి, చెడు నడత కలిగిన వ్యక్తులకు ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. సత్ప్రవర్తనతో జీవించాలని, సమాజంలో మంచి పౌరులుగా మెలగాలని, నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని సూచించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు దూరంగా ఉండాలన్నారు.
Similar News
News July 8, 2025
JGTL: వృద్ధురాలి అత్యాచారం కేసు.. నేరస్థుడికి 10 ఏళ్ల జైలు

రాయికల్ పోలీస్ స్టేషన్ పరిధిలో వృద్ధురాలిని అత్యాచారం చేసిన కేసులో నిందితుడు పుట్ట గంగరాజం (60)కు 10 ఏళ్ల జైలు శిక్షను జడ్జి నారాయణ సోమవారం విధించారు. పోలీస్ అధికారులు ఆధారాలు సమర్పించగా, కోర్ట్ డ్యూటీ అధికారులు సాక్షులను ప్రవేశపెట్టి విచారించారు. ఈ సందర్భంగా సమాజంలో నేరం చేసిన వారెవరూ కూడా శిక్ష నుంచి తప్పించుకోలేరని SP అన్నారు. ఈ కేసు దర్యాప్తులో కీలక పాత్ర పోషించిన అధికారులను ఆయన అభినందించారు.
News July 8, 2025
లండన్లో విరాట్ కోహ్లీ ఇల్లు ఎక్కడంటే?

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ లండన్లోని ఓ ఖరీదైన ప్రాంతంలో నివసిస్తున్నట్లు తెలుస్తోంది. లండన్లోని నాటింగ్ హిల్ ఏరియాలో ఉన్న సెయింట్ జాన్స్ వుడ్లో ఆయన ఇల్లు ఉన్నట్లు ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ జొనాథన్ ట్రాట్ తెలిపారు. స్టార్ స్పోర్ట్స్లో చర్చ సందర్భంగా ట్రాట్ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కోహ్లీ తన ఫ్యామిలీతో కలిసి లండన్లో స్థిరపడతారని కొంత కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే.
News July 8, 2025
VJA: కదంభ ప్రసాదం ప్రత్యేకత ఏంటో తెలుసా?

ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ జులై 8, 9, 10 తేదీల్లో శాకంబరి అవతారంలో దర్శనమివ్వనున్నారు. ఈ ఉత్సవాల్లో అమ్మవారిని కూరగాయలు, పండ్లతో అలంకరిస్తారు. ప్రత్యేకంగా తయారుచేసే కదంభ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు. పప్పు, బియ్యం, కూరగాయలు, సుగంధ ద్రవ్యాలతో చేసే ఈ ప్రసాదంలో ఆరోగ్య రహస్యాలు దాగి ఉన్నాయని ఆలయ సిబ్బంది తెలిపారు. ఈవో శీనా నాయక్ ప్రసాద పంపిణీకి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.