News April 10, 2025

నంద్యాల: పండ్లు మాగించడంపై అవగాహన

image

అనుమతులున్న పౌడర్లు మాత్రమే వాడి మామిడి పండ్లను మాగించాలని జిల్లా అధికారులు అన్నారు. అందుకు ఏసీ గోడౌన్లను ఉపయోగించుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి నాగరాజు, మార్కెటింగ్ ఏడీఎస్ అబ్దుల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు ఓ. వెంకట రాముడు, కాసింలు తెలిపారు. ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్, ఉద్యాన శాఖల ఆధ్వర్యంలో నిషేధిత క్యాల్షియం కార్బైడ్ వినియోగంపై బుధవారం పండ్ల వ్యాపారస్తులకు తెలిపారు.

Similar News

News October 27, 2025

మొంథా తుఫాన్.. కడప JC కీలక సూచనలు

image

కడప జిల్లాలో నేటి నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలకు JC అదితి సింగ్ పలు <>సూచనలు<<>> చేశారు.
➤సోషల్ మీడియాలో వచ్చే అవాస్థవాలను నమ్మొద్దు.
➤వాతావరణ హెచ్చరికల కోసం సెల్ఫోన్లకు ఛార్జింగ్ పెట్టుకొని, SMSలను గమనిస్తూ ఉండండి.
➤విలువైన పత్రాలను వాటర్ ఫ్రూఫ్ కవర్లలో ఉంచండి.
➤మీ ఇల్లు సురక్షితం కాకపోతే.. సురక్షితమైన స్థానాలకు వెళ్లండి.
➤పాత భవనాలు, చెట్లు, విద్యుత్ వైర్ల కింద ఉండకండి.
>> SHARE IT

News October 27, 2025

తుఫాను ఎఫెక్ట్.. 22 జిల్లాల్లో సెలవులు

image

AP: మొంథా తుఫాను నేపథ్యంలో 22 జిల్లాల్లోని స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాల్లో సెలవులు ఇవ్వలేదు. తుఫాను ప్రభావం తీవ్రంగా ఉండే కాకినాడ(D)లో ఇవాళ్టి నుంచి 31వ తేదీ వరకు హాలిడేస్ ఇచ్చారు. మిగతా జిల్లాల్లో 1 నుంచి 3 రోజుల వరకు సెలవులు ప్రకటించారు. అటు రేపు రాత్రికి మచిలీపట్నం-కళింగపట్నం మధ్య తుఫాను తీరం దాటే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది.

News October 27, 2025

ఇంటి తాళాలు పగులగొట్టి బంగారం, నగదు అపహరణ

image

ఇంటికి తాళాలు వేసి చుట్టాల ఇంటికి వెళ్లిన వృద్ధ దంపతుల ఇంటిలో దుండగులు చొరబడి రూ.1.60 లక్షల విలువైన బంగారం, నగదును అపహరించినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన ఏలూరు త్రీ టౌన్‌లోని శ్రీరామ్ నగర్‌లో చోటుచేసుకుంది. ఆదివారం ఇంటికి తిరిగి వచ్చిన ఇంటి యజమాని బాలగంగాధర్ తిలక్ ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ కోటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు వివరించారు.