News January 29, 2025
నంద్యాల ప్రజలకు SP కీలక ఆదేశాలు

అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్ను లిఫ్ట్ చేయకూడదని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా పలు ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా మిమల్ని ట్రాప్ చేసి బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటివి ఎదుర్కొంటే భయపడకుండా 1930కు ఫిర్యాదు చేయాలని SP సూచించారు.
Similar News
News December 20, 2025
పార్వతీపురం: ‘ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై నిరంతర నిఘా ఉంచాలి’

ప్లాస్టిక్ తయారీ యూనిట్లపై పరిశ్రమల శాఖ నిరంతర నిఘా ఉంచాలని జాయింట్ కలెక్టర్ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో అధికారులతో ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణపై ఆయన ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. మార్కెట్లు, దుకాణాలు, గ్రామీణ వారపు సంతల్లో ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్ వినియోగం అధికంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
News December 20, 2025
GHMC వార్డుల విభజన.. బయటికొచ్చిన మ్యాపులు (EXCLUSIVE)

గ్రేటర్ హైదరాబాద్ వార్డుల పునర్విభజనపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఆదేశాలతో లంగర్ హౌస్ (వార్డు 134), షా అలీ బండ (వార్డు 104)లకు సంబంధించిన సరిహద్దు మ్యాపులను అధికారులు వెల్లడించారు. తాజా నివేదిక ప్రకారం లంగర్ హౌస్లో 50,484 మంది, షా అలీ బండలో 32,761 మంది జనాభా ఉన్నట్లు తేలింది. బాపు ఘాట్, మూసీ నది, గోల్కొండ కోట గోడల వెంట వార్డుల విభజన తీరు ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశమైంది.
News December 20, 2025
ఈ నెల 28 నుంచి అసెంబ్లీ?

TG: ఈ నెల 28 నుంచి 3 రోజులపాటు అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. హిల్ట్ పాలసీ, ఇరిగేషన్, GHMC విలీన ప్రక్రియ, ఫోన్ ట్యాపింగ్పై సిట్ విచారణ, ఫార్ములా ఈ-కార్ రేసింగ్పై ఏసీబీ విచారణ తదితర అంశాలపై చర్చించనున్నారు. అలాగే సర్కారు పలు బిల్లులను ప్రవేశపెట్టనుంది. పరిషత్, మున్సిపల్ ఎన్నికల్లో BCలకు పార్టీపరంగా 42% టికెట్లు ఇచ్చే అంశంపై చర్చించనున్నట్లు సమాచారం.


