News January 29, 2025
నంద్యాల ప్రజలకు SP కీలక ఆదేశాలు

అపరిచితుల నుంచి వచ్చే వీడియో కాల్స్ను లిఫ్ట్ చేయకూడదని నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ప్రజలకు సూచించారు. అపరిచితుల నుంచి వచ్చే కాల్స్ ద్వారా పలు ప్రమాదాలు ఎదుర్కొనే అవకాశం ఉందన్నారు. అంతేకాకుండా మిమల్ని ట్రాప్ చేసి బెదిరించే అవకాశం ఉందని హెచ్చరించారు. ఎవరైనా ఇలాంటివి ఎదుర్కొంటే భయపడకుండా 1930కు ఫిర్యాదు చేయాలని SP సూచించారు.
Similar News
News October 14, 2025
HYD: సీజనల్ వ్యాధుల నియంత్రణపై హెల్త్ మినిస్టర్ సమీక్ష

రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల పనితీరు, సీజనల్ వ్యాధుల నియంత్రణపై మంత్రి దామోదర రాజనరసింహ HYDలోని సెక్రటేరియట్లో ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈఏడాది డెంగీ 2,900, మలేరియా 209, టైఫాయిడ్ 4,600, చికున్గున్యా249 కేసులు నమోదవగా గతంతో పోల్చితే గణనీయంగా తగ్గాయని మంత్రికి వివరించారు. వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల ప్రబలే వ్యాధులు,తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని మంత్రి సూచించారు.
News October 14, 2025
MNCL: హస్తం పగ్గాలు అక్క చేతికేనా..?

జిల్లాలో కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎంపిక కీలకంగా మారింది. మంత్రి గడ్డం వివేక్, ఎమ్మెల్యే వినోద్తో MNCL MLA ప్రేమ్ సాగర్ రావు మధ్య వివాదం అందరికీ తెలిసిందే. మంత్రి పదవి గడ్డం కుటుంబానికి కేటాయించారు. కాబట్టి డీసీసీ అధ్యక్ష పదవి కొక్కిరాల ఫ్యామిలీకి ఇస్తారని చర్చ నడుస్తోంది. కొందరు పొటీలో ఉన్నా.. పార్టీని ఎప్పటి నుంచో నడిపిస్తున్న కొక్కిరాల సురేఖకు అప్పజెపుతారని, ఆమె వద్దంటే ఇతరులకు ఇస్తారని టాక్.
News October 14, 2025
ASF: విభేదాలు.. ఎవరికో ‘హస్తం’ పగ్గాలు

ASF జిల్లాలో కాంగ్రెస్ పగ్గాలు ఎవరికి అందజేస్తారని ఆసక్తి నెలకొంది. విశ్వప్రసాద్ రావు, శ్యామ్ నాయక్ వర్గాల మధ్యలో విభేదాలతో పార్టీ సతమతం అవుతోంది. వీరిద్దరిలో అధ్యక్ష పదవిపై పోటీ ఉంది. అలాగే విశ్వప్రసాదరావు వర్గంలోని అనిల్ గౌడ్ తదితరులు దరఖాస్తులు ఇస్తారని సమాచారం. సిర్పూర్(టి) నియోజకవర్గంలో దండే విఠల్ ప్రాతినిధ్యం వహిస్తున్నా.. అధ్యక్ష బరిలో ఉంటానని ఆయన వెల్లడించలేదు. ఎవరికి పగ్గాలిస్తారో చూడాలి.