News April 13, 2025

నంద్యాల: బాదంపప్పుపై ఆంజనేయ స్వామి చిత్రం

image

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ హనుమాన్ జయంతి సందర్భంగా.. బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదంపప్పుపై హనుమంతుడు చిత్రాన్ని చిత్రీకరించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వస్తున్న రూపంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, వారి ప్రతిభను ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు.

Similar News

News February 23, 2026

మోచేతులు నల్లగా ఉన్నాయా? ఈ టిప్స్ పాటించండి

image

ముఖంపై పెట్టే శ్రద్ధ చాలామంది కాళ్లు, చేతులపై పెట్టరు. దీంతో మోచేతులు, మోకాళ్లు నల్లగా మారతాయి. దీన్ని కొన్ని ఇంటి చిట్కాలతో తగ్గించుకోవచ్చు. రోజుకి రెండు సార్లు కలబంద గుజ్జును మోచేతులు, కాళ్లకి రాస్తుంటే నలుపుదనం తగ్గుతుంది. స్పూన్ ఆలివ్ ఆయిల్‌లో కాస్త పంచదార వేసి దాంతో చేతులు, కాళ్లని స్క్రబ్ చేసి, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కొబ్బరినూనెలో నిమ్మరసం కలిపి రాసినా సమస్య తగ్గుతుంది.

News February 23, 2026

కృష్ణా: 14 కి.మీ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్‌కు ప్రణాళికలు

image

విజయవాడలో కనకదుర్గ ఫ్లైఓవర్ నుంచి గంగూరు వరకు 14KM ఎలివేటెడ్ మెగా ఫ్లైఓవర్ కారిడార్ నిర్మాణానికి NH అధికారులు సానుకూలంగా స్పందించారు. బందరు రోడ్డునుంచి వచ్చే వాహనాలు ట్రాఫిక్ ఆటంకం లేకుండా అమరావతి వైపు ప్రయాణించేందుకు ఈ ప్రాజెక్ట్ ఉపయోగపడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రోడ్డు విస్తరణ లేకుండానే 6 వరుసల ఫ్లైఓవర్ నిర్మాణం చేపట్టనున్నారు. గంగూరు- దావులూరు ORR వరకు హైవేను 6 లైన్లుగా విస్తరిస్తారు.

News February 23, 2026

జనుము, అలసందతో భూమికి కలిగే మేలు

image

ఎకరంలో 6-8KGల జనుము విత్తనాలు చల్లి పూతకు వచ్చాక కలియదున్నితే భూమికి 40KGల నత్రజని, 60KGల భాస్వరం, 25KGల పొటాషియం, ఇతర పోషకాలు అందుతాయి. ఎకరంలో 14-15KGల అలసంద విత్తనాలను చల్లి పంట కోత తర్వాత మొదళ్లను, ఆకులను భూమిలో కలియదున్నితే 35KGల నత్రజని, 8KGల భాస్వరం, 24KGల పొటాష్ భూమికి అందుతాయి. ఇవి భూమికి అధిక పోషకాలను అందించడంతోపాటు చౌడు, కలుపు సమస్యను తగ్గిస్తాయి.