News April 13, 2025
నంద్యాల: బాదంపప్పుపై ఆంజనేయ స్వామి చిత్రం

నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ చిత్రకారుడు చింతలపల్లె కోటేశ్ హనుమాన్ జయంతి సందర్భంగా.. బాదంపప్పుపై ఆంజనేయస్వామి చిత్రాన్ని చిత్రీకరించాడు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. బాదంపప్పుపై హనుమంతుడు చిత్రాన్ని చిత్రీకరించడం సంతోషకరంగా ఉందని తెలిపారు. హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని మోసుకు వస్తున్న రూపంలో ఈ చిత్రాన్ని అద్భుతంగా తీర్చిదిద్దారని, వారి ప్రతిభను ప్రముఖులు ప్రత్యేకంగా కొనియాడారు.
Similar News
News January 7, 2026
వాటర్ హీటర్ వాడుతున్నారా?

ఇమ్మర్షన్ రాడ్ వాటర్ హీటర్ వాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ప్లాస్టిక్ బకెట్లే వాడాలి. ఇనుప బకెట్లు వద్దు. నీటిలో హీటర్ పెట్టాకే స్విచ్ ఆన్ చేయాలి. హీట్ అవుతున్నప్పుడు నీళ్లను, బకెట్ను తాకకూడదు. నీళ్లు వేడయ్యాక స్విచ్ఛాఫ్ చేశాకే రాడ్ తీసేయాలి’ అని చెబుతున్నారు. తాజాగా UP ముజఫర్నగర్లో లక్ష్మి(19), నిధి(21) అనే అక్కాచెల్లెలు హీటర్ రాడ్ తగిలి విద్యుత్ షాక్తో చనిపోయారు.
News January 7, 2026
రాజధాని అమరావతి ప్రజలకు గుడ్ న్యూస్.!

మంగళగిరి ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పశ్చిమ బైపాస్ సంక్రాంతికి పాక్షికంగా అందుబాటులోకి తేవాలని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ అధికారులు నిర్ణయించారు. అమరావతి రాజధానిలో కీలకంగా నిలవనున్న ఈ బైపాస్ అందుబాటులోకి వస్తే NH 16, విజయవాడలో ట్రాఫిక్ రద్దీ తగ్గే అవకాశం ఉంది. చినకాకాని నుంచి గొల్లపూడి వరకు 17.636 కిలోమీటర్ల మేర రూ.1,546 కోట్ల వ్యయంతో బైపాస్ నిర్మాణాన్ని చేపట్టారు.
News January 7, 2026
భూపాలపల్లి ఐటీఐలో ఈనెల 12న అప్రెంటిస్షిప్ మేళా

జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రభుత్వ ఐటీఐలో ఈనెల 12న ప్రధాన మంత్రి నేషనల్ అప్రెంటిస్షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. ఈ మేళాలో టాటా మోటార్స్ పుణె, బజాజ్ ఆటో పుణె, అడెక్కో ఐఫోన్ హోసూరు సంస్థల ప్రతినిధులు హాజరవుతారన్నారు. అర్హత గల వారు www.apprenticeshipindia.gov.in వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


