News June 13, 2024

నంద్యాల: మంత్రిగా ప్రమాణస్వీకారం తర్వాత ఫరూక్ కీలక వ్యాఖ్యలు

image

ఎన్‌ఎండీ ఫరూక్‌ నాలుగోసారి మంత్రి పదవిని దక్కించుకున్నారు. ప్రమాణ స్వీకారం అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ఉమ్మడి జిల్లాలో రహదారులు దెబ్బతిని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోయారు. వాటి మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తా. తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తా. కర్నూలు నుంచి నంద్యాలకు నూతన రైల్వే లైన్‌ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటా. పలు పరిశ్రమలు రావడానికి కృషి చేస్తా’ అన్నారు.

Similar News

News December 20, 2025

కర్నూలు: మిరప పంటలో గంజాయి సాగు

image

చిప్పగిరి మండలం దేగులపాడు గ్రామ పరిధిలో మిరప పంటలో అంతర పంటగా గంజాయి సాగు చేసినట్లు పోలీసులు గుర్తించారు. సమాచారం అందుకున్న వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు.. పొలాన్ని తనిఖీ చేసి గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకున్నారు. దీనిపై పూర్తిస్థాయి దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

News December 20, 2025

నూతన ఆలోచనలతో అద్భుతాలు సృష్టించాలి: కలెక్టర్

image

నూతన ఆలోచనలతో విద్యార్థులు అద్భుతాలు సృష్టించాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అన్నారు. శనివారం కర్నూలు ప్రభుత్వ టౌన్ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన జిల్లాస్థాయి విద్య, వైజ్ఞానిక ప్రదర్శనలను డీఈవో సుధాకర్, ఏపీసీ లోకరాజుతో కలిసి ఆమె ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు తమ ఆలోచనలకు పదును పెట్టి నమూనాలను రూపొందించాలన్నారు.

News December 20, 2025

క్రిస్మస్, న్యూ ఇయర్.. కర్నూలు ఎస్పీ హెచ్చరిక

image

క్రిస్మస్, న్యూ ఇయర్ గిఫ్ట్ పేరుతో సోషల్ మీడియాలో వస్తున్న అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని SP విక్రాంత్ పాటిల్ ప్రజలను హెచ్చరించారు. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్, వాట్సాప్, టెలిగ్రామ్ ద్వారా వచ్చే గిఫ్ట్ కార్డు లింకులతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు. వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ వివరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పంచుకోవద్దన్నారు. మోసానికి గురైతే 1930, 100, 102కు కాల్ చేయాలన్నారు.