News April 10, 2025
నంద్యాల: మత్తు పదార్థాలను నియంత్రించాలి

నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సహకరించి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోఆర్డినేషన్ కమిటీతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొందని చెప్పారు.
Similar News
News December 13, 2025
ఈనెల 18న ఆత్మకూరులో కబడ్డీ జిల్లా సెలక్షన్స్

యాదాద్రి భువనగిరి జిల్లా స్థాయి సీనియర్ కబడ్డీ సెలక్షన్స్ డిసెంబర్ 18న ఆత్మకూరు జెడ్పీహెచ్ఎస్లో జరుగుతాయని జిల్లా మోడ్రన్ కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షుడు పూర్ణచందర్ రాజ్ తెలిపారు. ఆసక్తిగల క్రీడాకారులు 18వ తేదీ ఉదయం 9 గంటలకు ఆధార్ కార్డుతో పీఈటీ ఇందిరకి రిపోర్ట్ చేయాలని సూచించారు. ఎంపికైన జట్టు డిసెంబర్ 25న ఖమ్మంలో ఆడునుందని పేర్కొన్నారు.
News December 13, 2025
చౌటుప్పల్: ‘ఆస్తులు పెరిగితే గ్రామానికే రాసిస్తా’

యాదాద్రి జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. ఇందులో భాగంగా చౌటుప్పల్ మండలంలో దేవలమ్మ నాగారం సర్పంచ్ అభ్యర్థి కొండ హారిక విజయ్ వినూత్నంగా హామీ ఇచ్చారు. ఎన్నికల అనంతరం తన ఆస్తులు పెరిగితే ఆ పెరిగిన ఆస్తులన్నింటినీ గ్రామాభివృద్ధికి ప్రజల పేరున రాసిస్తానని బాండ్ పేపర్పై రాసి ఓటర్లను ఓట్లు అభ్యర్థించారు. కాగా హారిక విజయ్ హామీ ప్రస్తుతం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది.
News December 13, 2025
మంచి నాయకుడి కోసం.. ఒక్కరోజు వెచ్చిద్దాం!

పంచాయతీ ఎన్నికల్లో ప్రతి ఓటూ వజ్రాయుధమే. ఊరిని అభివృద్ధి చేసే సమర్థుడైన నాయకుడిని ఎన్నుకోవడం మన బాధ్యత. ఒక్కరోజు సెలవు, కూలీ డబ్బులు పోయినా పర్వాలేదు.. మన ఊరి భవిష్యత్తు కోసం వచ్చామన్న తృప్తి ముఖ్యం. మీ ఓటుతో మంచి నాయకుడు గెలిస్తే ఆ ఊరంతా బాగుపడుతుంది. అందుకే డబ్బు, బంధుప్రీతి వంటి ప్రలోభాలకు లొంగకుండా, స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి. నిజాయితీ గల నాయకుడిని గెలిపించండి.


