News April 10, 2025

నంద్యాల: మత్తు పదార్థాలను నియంత్రించాలి 

image

నంద్యాల జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు సహకరించి పటిష్ఠ చర్యలు తీసుకోవాలని అడిషనల్ ఎస్పీ యుగంధర్ బాబు తెలిపారు. నంద్యాల జిల్లా పోలీస్ కార్యాలయంలో కోఆర్డినేషన్ కమిటీతో నిర్వహించిన సమావేశంలో అధికారులకు సూచనలు చేశారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ.. మాదకద్రవ్యాల నియంత్రణ అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొందని చెప్పారు. 

Similar News

News April 22, 2025

డ్రైవర్ డోర్ డెలివరీ కేసు పునర్విచారణ

image

AP: కాకినాడకు చెందిన దళిత యువకుడు సుబ్రహ్మణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసిన కేసులో పునర్విచారణకు కాకినాడ SP బిందు మాధవ్ ఆదేశించారు. విచారణ అధికారిగా IPS అధికారిని నియమించారు. 60 రోజుల్లో విచారణ నివేదిక అందజేయాలన్నారు. 2022 మే 19న YCP MLC అనంతబాబు తన డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేయడం సంచలనమైంది. అప్పటి ప్రభుత్వం ఈ కేసును నీరుగార్చిందనే ఆరోపణలు వచ్చాయి.

News April 22, 2025

సిరిసిల్ల : నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

image

జిల్లాలో మార్చిలో జరిగిన ఇంటర్ పరీక్ష ఫలితాలను ఇంటర్ బోర్డు నేడు విడుదల చేయనుంది. జిల్లాలో మొత్తం 9,310 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. అందులో 5,065 మంది ఫస్టియర్, 4.245 మంది సెకండియర్ విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం నేడు తేలనుందని అధికారులు తెలిపారు. ఫలితాలను Way2Newsలో అందరికంటే ముందే తెలుసుకోండి. ALL THE BEST

News April 22, 2025

వాస్మోల్ తాగి యువతి ఆత్మహత్యాయత్నం

image

భర్త ఇంటికి రావడం లేదని వాస్మోల్ తాగి వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కురబలకోట మండలంలో సోమవారం జరిగిన ఘటనపై పోలీసుల కథనం.. జేసీబీ డ్రైవర్ అనిల్ భార్య లక్ష్మ(23) తన భర్త సకాలంలో ఇంటికి రావడం లేదని గొడవపడి వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితురాలని మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యం అందించారు. దీంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది.

error: Content is protected !!