News February 21, 2025
నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు

నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు చేశారు. ఈ రైలు నంద్యాల నుంచి ఉదయం 6:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు రేణిగుంటకు చేరుకునేది. నేటి నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంటలో మధ్యాహ్నం 1:50కి బయలుదేరి, నంద్యాలకు రాత్రి 8:40 గంటలకు చేరుకుంటుంది. నిర్వహణపరమైన కారణాల వల్ల మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Similar News
News December 7, 2025
కొడంగల్: అభ్యర్థులకు కోవర్టుల టెన్షన్..?

పంచాయతీ ఎన్నికల సమరం వేళ, ప్రధాన పార్టీల అభ్యర్థులకు ‘కోవర్టుల’ సమస్య గుబులు పుట్టిస్తోంది. పార్టీల్లో అత్యంత రహస్యంగా చర్చించుకున్న వ్యూహాలు క్షణాల్లో ప్రత్యర్థులకు చేరుతుండటంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. తాము మాట్లాడుకున్న విషయాలు లీకవుతుండటంతో ప్రత్యర్థులు వెంటనే అప్రమత్తమై ప్రణాళికలు మార్చుకుంటున్నారు. ఈ ‘లీకు వీరుల’ వ్యవహారంతో నాయకులు ఎవరు నమ్మకస్తులో తెలియక తర్జనభర్జన పడుతున్నారు.
News December 7, 2025
సంకటహర చతుర్థి ప్రత్యేకత ఏంటంటే?

ఇవాళ వినాయకుడిని పూజిస్తే జీవితంలో అడ్డంకులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. ‘ఇవాళ సాయంత్రం 6.25 గంటలకు చతుర్థి ప్రారంభమయ్యి సోమవారం సాయంత్రం 4.03 గంటలకు ముగుస్తుంది. ఈరోజు వినాయకుడిని గరికతో పూజించడం విశేషం. చంద్ర దర్శనం తర్వాత వినాయక పూజ చేసుకోవడం శుభప్రదం. సంకటహర చతుర్థి వ్రతాన్ని చతుర్థి తిథిరోజు 3, 5, 11, 21 నెలలపాటు ఆచరించాలి. దీనిని బహుళ చవితి రోజు ప్రారంభించాలి’ అని పండితులు చెబుతున్నారు.
News December 7, 2025
ఈ ఆలయాలకు వెళ్తే..

మహారాష్ట్రలోని శని సింగ్నాపూర్ శని దోష నివారణకు చాలా ప్రసిద్ధి చెందింది. ఈ ఊర్లో ఇళ్లు, షాపులకు తలుపులు ఉండవు. న్యాయాధిపతి శని దేవుడి మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని నమ్ముతారు. శని దోషం ఉన్నవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శని దోషం తొలగిపోతుందని పండితులు చెబుతారు. శని ధామ్(ఢిల్లీ), కోకిలవ ధామ్(UP), తిరునల్లార్(తమిళనాడు) ఆలయాలను దర్శించడం వల్ల కూడా శని గ్రహ ప్రభావం తగ్గుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.


