News February 21, 2025

నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు

image

నంద్యాల-రేణిగుంట డెమో రైలు వేళల్లో మార్పులు చేశారు. ఈ రైలు నంద్యాల నుంచి ఉదయం 6:30 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12:45 గంటలకు రేణిగుంటకు చేరుకునేది. నేటి నుంచి ఉదయం 6 గంటలకే బయలుదేరి మధ్యాహ్నం 12:30 గంటలకు చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో రేణిగుంటలో మధ్యాహ్నం 1:50కి బయలుదేరి, నంద్యాలకు రాత్రి 8:40 గంటలకు చేరుకుంటుంది. నిర్వహణపరమైన కారణాల వల్ల మార్పులు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు.

Similar News

News September 19, 2025

58 ఉద్యోగాలకు నోటిఫికేషన్

image

బ్యాంక్ ఆఫ్ బరోడా(BOB)లో 58 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వెలువడింది. మేనేజర్, చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్ తదితర పోస్టులున్నాయి. జాబ్స్‌ను బట్టి ఎకనామిక్స్/కామర్స్‌లో డిగ్రీ, MBA/PGDM పూర్తిచేసిన వారు అర్హులు. ఉద్యోగాన్ని బట్టి జీతం రూ.64,820 నుంచి రూ.1,20,940 వరకు ఉంటుంది. దరఖాస్తుకు చివరి తేదీ OCT 9.
వెబ్‌సైట్: <>https://bankofbaroda.bank.in/<<>>
#ShareIt

News September 19, 2025

సెట్టూరులో ప్రిన్సిపల్‌పై విద్యార్థి దాడి

image

అనంతపురం జిల్లా సెట్టూరులోని AP మోడల్ స్కూల్లో పదో తరగతి విద్యార్థి చరణ్ ప్రిన్సిపల్ శ్రీరాములుపై దాడి చేశాడు. ప్రిన్సిపల్ విద్యార్థిని మందలించడంతో కోపోద్రిక్తుడై చేయి చేసుకున్నాడు. ఉపాధ్యాయులు విద్యార్థిని పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఘటనపై డిప్యూటీ DEO శ్రీనివాసులు పాఠశాలలో విచారణ చేపట్టారు.

News September 19, 2025

మహబూబాబాద్: ఐదుగురి కోసం 9 మంది..!

image

నెల్లికుదురు(M) రాజులకొత్తపల్లి జడ్పీ పాఠశాలలో ఐదుగురు విద్యార్థులకు 9 మంది ఉపాధ్యాయులు బోధన చేస్తుండటం విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపుతోంది. ఆరో తరగతిలో ఒకరు, ఏడో తరగతిలో ఇద్దరు, 8వ తరగతిలో ఇద్దరు విద్యార్థులు మాత్రమే ఉన్నారు. 9, 10వ తరగతుల్లో ఒక్క విద్యార్థి కూడా లేడు. పాఠశాల తెరిచి 3 నెలలు గడిచినా, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి.