News September 19, 2024
నంద్యాల: సీఎం సహాయ నిధికి రూ.2.22 కోట్ల విరాళం

శ్రీశైలం నియోజకవర్గం ప్రజలు అందించిన విరాళాలు రూ.2,22,70,749ను సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి అందజేశారు. మంగళగిరిలో సీఎం చంద్రబాబుకు ఈ మొత్తాన్ని అందజేశారు. నియోజకవర్గ ప్రజలు, టీడీపీ కార్యకర్తలు, నాయకులు, వ్యాపారవేత్తలు, పొదుపు మహిళలు, విద్యార్థులు అందించిన మొత్తం సొమ్మును లెక్క చూపి ఆయనకు అందజేశారు. ప్రజలకు ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని <<18009233>>మోదీ<<>> కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.
News October 15, 2025
కర్నూలులో రేపు ట్రాఫిక్ మళ్లింపు

రేపు ప్రధాని మోదీ కర్నూలు పర్యటన నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ మార్గాలు మళ్లింపు ఉంటాయని జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కడప నుంచి కర్నూలు మీదుగా హైదరాబాద్ వెళ్తున్న వాహనాలు కొల్లబాపురం, పూడూరు, అలంపూర్ బ్రిడ్జి, అలంపూర్ చౌరస్తా మార్గంలో వెళ్లాలని సూచించారు. ఇతర ప్రాంతాల వాహనదారులు ట్రాఫిక్ పోలీసుల సూచనలను అనుసరించాలని తెలిపారు.
News October 15, 2025
మగపిల్లలు పుట్టలేదని వ్యక్తి సూసైడ్

ఆదోని పరిధిలోని మదిరే వాసి గంపల సోమ(31) రైలు కిందపడి మంగళవారం మృతిచెందాడు. మగ పిల్లలు పుట్టలేదనే మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇస్వీ ఆర్ఎస్ 501/18 సమీపంలో మధ్యాహ్నం గూడ్స్ రైలు కిందపడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు. 8 ఏళ్ల క్రితం వివాహం కాగా.. ఆయనకు భార్య, కూతురు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు.