News April 13, 2025

నంద్యాల: 14న జరిగే కార్యక్రమం రద్దు

image

ఈనెల 14వ తేదీ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవు రోజు కావడంతో నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి, జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసాలు కూర్చి ఎవరు రావద్దన్నారు.

Similar News

News September 17, 2025

వరిధాన్యం రవాణాకు సహకరించండి: DTO

image

ఖరీఫ్ ధాన్యాన్ని రైస్ మిల్లులకు తరలించేందుకు సహకరించాలని లారీ, ట్రాక్టర్ యజమానులకు జిల్లా రవాణా అధికారి దేవిశెట్టి శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం సమీప రైతు సహాయక కేంద్రాల్లో తమ బ్యాంకు ఖాతా వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు. సహకరించిన వాహన యజమానులకు రవాణా ఛార్జీలను నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తామన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసేందుకు ముందుకు రావాలని కోరారు.

News September 17, 2025

తెలంగాణ విమోచనంలో ఉమ్మడి KNR జిల్లా యోధులు

image

TG సాయుధ పోరాటంలో ఉమ్మడిKNR జిల్లా వీరులది కీలకపాత్ర. నిజాం రాజుకు వ్యతిరేకంగా జరిగిన సాయుధ పోరాటానికి వీరులగడ్డ కేంద్రంగా నిలిచింది. అనభేరి ప్రభాకర్ రావు, బద్దం ఎల్లారెడ్డి, మల్లారెడ్డి, సింగిరెడ్డి అంజిరెడ్డి, బోయినపల్లి వెంకటరావు, దేశిని చిన్నమల్లయ్య లాంటి ఎందరో యోధులు నిజాం నిరంకుషత్వానికి వ్యతిరేకంగా పోరాడారు. TG సాయుధ పోరాటం వంటి ఉద్యమాల్లో పాల్గొని నిజాంకు సవాలు విసిరారు.

News September 17, 2025

ఆపరేషన్ పోలో కోదాడ నుంచే ప్రారంభం

image

ఉమ్మడి నల్గొండ జిల్లా పోరాటాలకు పురిటిగడ్డ. నిజాం నిరంకుశ పాలన, రజాకార్ల ఆగడాలను జిల్లా ప్రజలు ఎదురొడ్డి పోరాడారు. ఈ క్రమంలో నిజాం నవాబు పాలనలో బానిసత్వంలో మగ్గిన హైదరాబాద్ రాష్ట్ర ప్రజలను ఆపరేషన్ పోలో విముక్తుల్ని చేసింది. అయితే యూనియన్ సైన్యం మొదట అడుగుపెట్టింది మాత్రం కోదాడలోనే. అక్కడి నుంచే HYDకు జైత్రయాత్ర సాగించింది. ఈ క్రమంలో సెప్టెంబర్ 17న నిజాం తలొగ్గారు.