News April 13, 2025
నంద్యాల: 14న జరిగే కార్యక్రమం రద్దు

ఈనెల 14వ తేదీ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవు రోజు కావడంతో నంద్యాల కలెక్టరేట్లోని సెంటినరీ హాలులో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి, జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసాలు కూర్చి ఎవరు రావద్దన్నారు.
Similar News
News October 21, 2025
సరెండర్కు హిడ్మా సన్నద్ధం..?

పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ-1 కమాండర్ హిడ్మా లొంగిపోయేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 200మంది మావోయిస్టులతో సరెండర్ అయ్యేందుకు సన్నద్ధం అవుతున్నారని ప్రచారం. సుక్మా(CG) జిల్లాకు చెందిన హిడ్మా మావోల స్కూళ్లో చదివి చిన్న వయసులోనే ఉద్యమంలోకి వెళ్లాడు. భద్రన్న, నంబాల, చలపతి వంటి అగ్ర నేతలతో పనిచేసి ఎన్నో దాడులకు వ్యూహరచన చేశాడు. ఆయనను పట్టుకుంటే అడవిలో పోరాటం దాదాపు అంతం అవుతుందని కేంద్ర భావన.
News October 21, 2025
తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలి: కలెక్టర్

తెలంగాణ రైజింగ్-2047 సిటిజన్ సర్వేలో అందరూ పాల్గొనాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. రాష్ట్ర భవిష్యత్ రూపకల్పనకై ఉద్దేశించిన తెలంగాణ రైజింగ్ సిటిజన్ సర్వేకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని తెలిపారు. ఇప్పటివరకు ఈ సిటిజన్ సర్వేలో వివిధ ప్రాంతాల పౌరులు పాల్గొని తమ విలువైన సమాచారాన్ని అందచేశారని అన్నారు. telanganarising అనే వెబ్సైట్ను సందర్శించి, సలహాలు అందించాలన్నారు.
News October 21, 2025
రేపు ఇలా స్నానం చేస్తే.. అపమృత్యు భయం దూరం!

రేపు కార్తీక శుద్ధ పాడ్యమి నాడు సూర్యోదయానికి ముందే అభ్యంగన స్నానం చేస్తే అపమృత్యు భయం తొలగిపోతుందని పండితులు చెబుతున్నారు. ‘నువ్వుల నూనెను శరీరానికి మర్దన చేసుకొని స్నానం చేస్తే శరీరంలో మలినాలు తొలగి, సాత్వికత పెరుగుతుంది. కొత్త వస్త్రాలు ధరించి బలి చక్రవర్తిని, గోవులను పూజించి, దానాలు చేస్తే దేవుని అనుగ్రహం లభిస్తుంది’ అని సూచిస్తున్నారు.
* ఆధ్యాత్మిక సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>కి వెళ్లండి.