News April 13, 2025

నంద్యాల: 14న జరిగే కార్యక్రమం రద్దు

image

ఈనెల 14వ తేదీ డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ జయంతి సందర్భంగా.. సోమవారం నిర్వహించాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజకుమారి తెలిపారు. శనివారం ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వ సెలవు రోజు కావడంతో నంద్యాల కలెక్టరేట్‌లోని సెంటినరీ హాలులో నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమానికి, జిల్లా ప్రజలు వ్యయ ప్రయాసాలు కూర్చి ఎవరు రావద్దన్నారు.

Similar News

News December 1, 2025

ఉద్యోగుల బేసిక్ PAYలో 50% DA మెర్జ్? కేంద్రం సమాధానమిదే

image

ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ పేలో DA నుంచి కొంత మొత్తాన్ని మెర్జ్ చేసే ఆలోచన ప్రస్తుతానికి లేదని కేంద్రం స్పష్టం చేసింది. 50% DAను వెంటనే బేసిక్ పేలో కలపాలని ఇటీవల ఉద్యోగ సంఘాలు లేఖ రాసిన నేపథ్యంలో లోక్‌సభలో సమాధానమిచ్చింది. కాగా ఒకవేళ బేసిక్ PAYలో 50% డీఏ కలిస్తే ఎంట్రీ లెవల్ బేసిక్ పే ₹18వేల నుంచి ₹27వేలకి పెరగనుంది. అటు 8th పే కమిషన్ 2027లోగా అమల్లోకి వచ్చే అవకాశం కనిపించట్లేదు.

News December 1, 2025

సిరిసిల్ల: ‘1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాం’

image

సిరిసిల్ల జిల్లాలో 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని సిరిసిల్ల ఇన్చార్జి కలెక్టర్ గరీమా అగ్రవాల్ అన్నారు. మొత్తం జిల్లాలోని 239 కొనుగోలు కేంద్రాల ద్వారా 32,085 మంది రైతుల నుంచి 1,98,426 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పేర్కొన్నారు. ధాన్యం సేకరించిన వెంటనే రైతుల బ్యాంకు ఖాతాలో వెంటనే డబ్బు జమ చేయాలని ఆమె ఆదేశించారు.

News December 1, 2025

చందుర్తి : ఎంపీడీవో కార్యాలయాలు, చెక్‌పోస్టుల తనిఖీ

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఎన్నికల వ్యయ పరిశీలకులు రాజ్‌కుమార్ సోమవారం పలు ఎంపీడీవో కార్యాలయాలు, ఎస్.ఎస్.టి. (స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్) చెక్ పోస్ట్ లను తనిఖీ చేశారు. ఆయన రుద్రంగి ఎంపీడీవో కార్యాలయం, చెక్‌పోస్టులను తనిఖీ చేసి అధికారులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చందుర్తి, వేములవాడ అర్బన్, రూరల్ ఎంపీడీవో కార్యాలయాలను పరిశీలించి, సహాయ వ్యయ పరిశీలకులతో సమావేశం నిర్వహించారు.