News April 12, 2024

నంద్యాల: 33 ఏళ్ల తర్వాత ఒక్కటైన ప్రత్యర్థులు.. గెలుపు ఖాయమేనా?

image

ప్రత్యర్థులు భూమా, ఇరిగెల కుటుంబాలు ఒక్కటయ్యాయి. 1992 ఆళ్లగడ్డ ఉప ఎన్నికలో భూమా నాగిరెడ్డి, గంగుల ప్రభాకర్‌రెడ్డి పోటీచేశారు. జమ్మలమడుగు MLA శివారెడ్డి, NMD ఫరూక్‌ మధ్యవర్తిత్వంతో ఇరిగెల కుటుంబం నాగిరెడ్డి విజయానికి కృషిచేసింది. ఆ 2 కుటుంబాల కలయితో గెలుపు నల్లేరుపై నడకగా మారిందని రాజకీయ విశ్లేషకులు భావించారు. మళ్లీ 33 ఏళ్ల తర్వాత మళ్లీ ఏకమవ్వడంతో అఖిలప్రియ గెలుపు సులభమేనని అంచనా వేస్తున్నారు.

Similar News

News October 20, 2025

నేడు రద్దు: ఎస్పీ

image

దీపావళి పండుగ సందర్భంగా ఇవాళ జరగాల్సిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. కర్నూలు కొత్తపేటలోని ఎస్పీ క్యాంపు కార్యాలయంలో ఈ వేదిక జరగాల్సి ఉంది. పండుగ కారణంగా ప్రభుత్వ సెలవు దినం కావడంతో కార్యక్రమం నిలిపివేశామని ఎస్పీ పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి అర్జీలు ఇవ్వడానికి వచ్చే ప్రజలు వ్యయప్రయాసలతో రావొద్దని విజ్ఞప్తి చేశారు.

News October 19, 2025

కర్నూలు: 9 నెలల్లో 6,858 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

image

కర్నూలు రేంజ్‌లో 9 నెలల్లో మద్యం మత్తులో వాహనాలు నడిపిన 6,858 మందిపై పోలీసులు కేసులు నమోదు చేసినట్లు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, ఎస్పీ విక్రాంత్ పాటిల్ వివరాలు వెల్లడించారు. రహదారి భద్రతలో భాగంగా ప్రతి రోజు వాహన తనిఖీలు నిర్వహించి, డ్రైవర్లకు కౌన్సెలింగ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 13,555 మందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు.

News October 19, 2025

లిక్కర్ షాపుల కోసం రూ.4.5 కోట్లు పెట్టిన కర్నూలు మహిళ

image

కర్నూలు జిల్లాకు చెందిన ఓ మహిళ తెలంగాణలోని 150 వైన్ షాపులకు దరఖాస్తు చేసింది. ఇందుకోసం ఆమె రూ.4.5 కోట్లు చెల్లించింది. ఏపీకి సరిహద్దుల్లో ఉండే జిల్లాల్లోని షాపులకు ఈమె ఎక్కువగా దరఖాస్తు చేసినట్టు సమాచారం. ఆమెకు ఏపీలోనూ ఎక్కువ దుకాణాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 23న డ్రా ద్వారా వైన్ షాపులకు లైసెన్స్ ఇవ్వనున్నారు.