News September 11, 2024

నంద్యాల: 63 రోజులుగా కనిపించని బాలిక ఆచూకీ

image

పగిడ్యాల మండలం ముచ్చుమర్రి బాలిక ఆచూకీ 63 రోజులైనా తెలియకపోవడం దారుణమని ఎంవీఆర్‌పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పులి కొండన్న ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం రాత్రి నంద్యాల మండలం హెచ్.కొట్టాల, కానాల, ఎం.చింతకుంట, తదితర గ్రామాల్లో పర్యటించి వాల్మీకి యువతతో సమావేశమయ్యారు. ముచ్చుమర్రి బాలిక హత్యాచారానికి గురైందని తెలిసి 63 రోజులైనా ఎటువంటి ఆనవాళ్లూ దొరకలేదని, ఈ ఘటనను అధికారులు పూర్తిగా వదిలేశారని వాపోయారు.

Similar News

News November 10, 2025

టైక్వాండో పోటీల్లో కర్నూలు విద్యార్థుల విజయం

image

రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్స్ టైక్వాండో పోటీల్లో పతకాలు సాధించిన క్రీడాకారులను కలెక్టర్ డా. ఏ. సిరి అభినందించారు. కడప జిల్లా రైల్వే కోడూరులో జరిగిన అండర్–19 విభాగంలో సుగందిని వెండి, ఇంద్రాణి కాంస్య పతకాలు గెలిచారు. ఏలూరులో జరిగిన అండర్–17 విభాగంలో లేఖ్యశ్రీ చందన వెండి, నక్షత్ర, రేవంత్ కాంస్య పతకాలు సాధించారు. క్రీడాకారులను ప్రోత్సహించిన కోచ్ షబ్బీర్ హుస్సేన్‌ను కలెక్టర్ అభినందించారు.

News November 10, 2025

కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు సీఎం శంకుస్థాపనలు

image

ఈ నెల 11న కర్నూలు జిల్లాలో పలు ప్రాజెక్టులకు వర్చువల్‌గా సీఎం చంద్రబాబు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాలని అధికారులను కలెక్టర్ సిరి ఆదేశించారు. దీనిపై సంబంధిత అధికారులతో ఆమె ఆదివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఏపీఐఐసీ, విమానాశ్రయం, పర్యటక శాఖలకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

News November 10, 2025

కర్నూలు: డయల్ యువర్ APSPDCL సీఎండీ

image

ఇవాళ ఉదయం 10 నుంచి 12 గంటల వరకు విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డయల్ యువర్ APSPDCL సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆ సంస్థ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ ఆదివారం వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా కర్నూల్, నంద్యాల జిల్లాలలోని విద్యుత్ వినియోగదారులు తమ సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చన్నారు. 8977716661 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు.