News March 17, 2025

నంద్యాల: ALERT.. మధ్యాహ్నం 12:30 వరకే

image

నంద్యాల కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నేడు “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక” కార్యక్రమం ద్వారా ప్రజల నుంచి వినతులు స్వీకరించనున్నట్లు కలెక్టర్‌ రాజకుమారి గణియా ఒక ప్రకటనలో తెలిపారు. వేసవిని దృష్టిలో ఉంచుకొని కార్యక్రమాన్ని ఉ.9:30 గం.లకు ప్రారంభించి మ.12:30 గం.లకు పూర్తి చేస్తున్నట్లు తెలిపారు. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Similar News

News October 21, 2025

సమాజాన్ని మేలుకొల్పే చిత్రాలకు చిరునామా ఆయన

image

సామాజిక అంశాలనే కథాంశంగా సంచలన సినిమాలు తీసిన దర్శకుడిగా టి.కృష్ణ పేరొందారు. విజయశాంతిని స్టార్‌ను చేసిన ‘ప్రతిఘటన’ చిత్రానికి ఆయనే డైరెక్టర్. నేటి భారతం, వందేమాతరం, దేవాలయం, దేశంలో దొంగలు పడ్డారు, రేపటి పౌరులు, అర్ధరాత్రి స్వతంత్రం తదితర చిత్రాలకు దర్శకత్వం వహించారు. క్యాన్సర్ బారిన పడిన ఆయన 1987లో కన్నుమూశారు. హీరో గోపీచంద్ ఈయన కుమారుడే. ఇవాళ టి.కృష్ణ వర్ధంతి.

News October 21, 2025

ఖమ్మం: పోలీసు అమరులకు సెల్యూట్.. త్యాగం గొప్పది

image

విధి నిర్వహణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగం గొప్పదని ఖమ్మం, భద్రాద్రి జిల్లా వాసులు స్మరించుకుంటున్నారు. పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా నేడు వారికి నివాళులు అర్పించనున్నారు. ఉమ్మడి జిల్లాలో నక్సలైట్ల దాడుల్లో అనేక మంది పోలీసులు వీరమరణం పొందారు. 1997లో కరకగూడెం ఠాణాపై దాడిలో 16 మంది, 1991లో రాళ్లవాగు, 1992లో మోతుగూడెం ఘటనల్లో అమరులైన వారి సేవలు భవిష్యత్ తరాలకు ఎప్పటికీ స్ఫూర్తిదాయకం.

News October 21, 2025

గోదావరిఖనిలోనూ నిజామాబాద్ తరహా ఎన్‌కౌంటర్..!

image

NZBలో రియాజ్‌ పోలీసులు జరిపిన కాల్పుల్లో మరణించిన విషయం తెలిసిందే. అచ్చం ఇలాంటి ఘటనే 2012లో గోదావరిఖనిలో జరిగింది. 2012 JUN 11న పోలీసులపై తిరగబడ్డ రౌడీషీటర్ కట్టెకొల సుధీర్‌ను కాల్చిచంపారు. ఓ కేసు విషయంలో RGM మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు సుధీర్‌ను అరెస్ట్ చేయడానికి యత్నిస్తుండగా అతడు పోలీసులపై తన రివాల్వర్‌తో కాల్పులు జరిపాడు. ఈ క్రమంలో ఆత్మరక్షణకు పోలీసులు జరిపిన కాల్పుల్లో సుధీర్ చనిపోయాడు.