News March 19, 2025
నకరికల్లు: రీ సర్వేపై రైతులతో మాట్లాడిన కలెక్టర్

నకరికల్లు మండలంలో జరుగుతున్న రీ సర్వేపై కలెక్టర్ అరుణ్ బాబు నేరుగా రైతులతో బుధవారం మాట్లాడారు. సర్వే వివరాలను పూర్తిస్థాయిలో రైతులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు. రైతుల వైపుగా ఉండే ఇబ్బందులు, సర్వేకు సంబంధించిన సమస్యలను పరిగణలోకి తీసుకోవాలన్నారు. గ్రామంలో ఇప్పటి వరకు జరిగిన సర్వే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కచ్చితమైన వివరాలతో విస్తరణతో సర్వేను నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు.
Similar News
News October 14, 2025
శామీర్పేట్: కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ ధర్నా

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయిపై రాకేశ్ కిషోర్ అనే అడ్వకేట్ షూ విసరడాన్ని ఖండిస్తూ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టరేట్ ముందు ఎమ్మార్పీఎస్ నాయకులు ఈరోజు ధర్నా చేపట్టారు. కలెక్టరేట్ కార్యాలయం లోపలికి వెళ్లేందుకు యత్నించిన ఎమ్మార్పీఎస్ నాయకులను పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. న్యాయమూర్తులకు రక్షణ కరవైందన్నారు.
News October 14, 2025
తల్లాడ: ప్రేమ విఫలమైందని యువకుడి సూసైడ్

ప్రేమ విఫలమైందని పురుగు మందు తాగి ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తల్లాడ మండలంలో చోటుచేసుకుంది. మల్సూరు తండా గ్రామానికి చెందిన మాలోతు మణికంఠ (19) నాలుగు రోజుల క్రితం పురుగుల మందు తాగాడు. కుటుంబ సభ్యులు గమనించి ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News October 14, 2025
చోడవరంలో 275 కిలోల గంజాయి పట్టివేత

చోడవరం వద్ద పోలీసులు 275 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురిని అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా సోమవారం తెలిపిన వివరాల ప్రకారం, అల్లూరి జిల్లా తర్లగూడకు చెందిన వంతల దేవదాస్ ఒడిశా చిత్రకొండ నుంచి గంజాయి కొనుగోలు చేసి రాజస్థాన్కు తరలించేందుకు యత్నించాడు. ఎనిమిది సంచుల్లో ప్యాక్ చేసిన గంజాయి, కారు, రెండు బైక్లు, ఐదు ఫోన్లు స్వాధీనం. మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నారని తెలిపారు.