News June 23, 2024

నకిరేకల్, నల్గొండ నాకు రెండు కళ్లు: మంత్రి కోమటిరెడ్డి

image

తాను అధికారంలో ఉన్నా లేకున్నా చచ్చేంత వరకు ప్రజల్లోనే ఉండి ప్రజాసేవకే తన జీవితం అంకితం చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. చిట్యాలలో ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి మాట్లాడారు. నకిరేకల్, నల్గొండ నియోజకవర్గాలు తనకు రెండు కళ్లతో సమానమన్నారు. తన రాజకీయ ప్రస్థానం చిట్యాల నుంచే ప్రారంభమైందని, చిట్యాలకు తనకు విడదీయరాని అనుబంధం ఉందన్నారు.

Similar News

News October 19, 2025

నల్గొండ: 23 వరకు గడువు.. 27న డ్రా

image

నల్గొండ జిల్లాలో 154 వైన్స్‌లకు 4,619 దరఖాస్తులు వచ్చినట్లు ఎక్సైజ్ అధికారులు తెలిపారు. నిన్న ఏకంగా 2, 180 దరఖాస్తులు అందాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 3 లక్షలు చొప్పున రూ. 138.57 కోట్లు ఆదాయం సమకూరింది. గత పాలసీలో 155 వైన్స్‌లకు 7,057 దరఖాస్తులు వచ్చాయి. ఒక్కో దరఖాస్తుకు రూ. 2 లక్షల చొప్పున రూ. 141.14 కోట్ల ఆదాయం లభిచింది. 23 వరకు గడువు పొడిగించడంతో దరఖాస్తులు పెరిగే అవకాశముంది. 27డ్రా తీయనున్నారు.

News October 19, 2025

NLG: ల్యాప్‌టాప్, నగదు మిస్సింగ్.. నిజాయితీ రూపంలో తిరిగొచ్చాయి

image

నల్గొండ నుంచి మిర్యాలగూడకు ప్రయాణిస్తున్న నెమ్మాని సంధ్య ఆటోలో తన ల్యాప్‌టాప్‌తో పాటు రూ.1500 నగదు మరిచిపోయారు. అయితే ఆటో డ్రైవర్ ఎండీ లతీఫ్ వాటిని నల్గొండ టూ టౌన్ పోలీసులకు అప్పగించి తన నిజాయితీని చాటుకున్నారు. ఎస్సై వై. సైదులు విచారణ జరిపి ల్యాప్‌టాప్, నగదును సదరు మహిళకు అందజేశారు. లతీఫ్ నిజాయితీని ఎస్సై అభినందించారు. ఈ మంచితనం ఆదర్శనీయమని ఎస్సై పేర్కొన్నారు.

News October 18, 2025

న్యాయ అవగాహన పెంపులో పీఎల్‌వీల సేవ కీలకం: జడ్జి పురుషోత్తం రావు

image

సమాజంలో న్యాయ అవగాహన కల్పించడమే పారా లీగల్ వాలంటీర్ల(పీఎల్‌వీ) ప్రధాన లక్ష్యమని జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి పురుషోత్తం రావు అన్నారు. పీఎల్‌వీల ఐడీ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. న్యాయం అందరికీ చేరేలా పీఎల్‌వీలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఢిల్లీలో జరగబోయే జాతీయ కాన్ఫరెన్స్‌కు ఎంపికైన శ్రీకాంత్‌ను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.