News March 21, 2025

నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

image

నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంకు చెందిన ఎన్.రాము (54) రాజయ్యపేట శివారు కల్లుపాకల వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 19న పొలానికి వెళ్లిన రాము ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గురువారం కల్లుపాకల వద్ద శవమై కనిపించాడు. ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నందున కుటుంబ సభ్యులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.

Similar News

News October 20, 2025

గాల్లో విమాన అద్దం ధ్వంసం.. ఎమర్జెన్సీ ల్యాండింగ్

image

డెన్వర్(US) నుంచి లాస్‌ఏంజెలిస్ వెళ్తున్న యునైటెడ్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్ 737 మ్యాక్స్ 8 విమానం ఘోర ప్రమాదం తప్పించుకుంది. గాల్లో 36 వేల ఫీట్ల ఎత్తులో ఉన్న సమయంలో కాక్‌పిట్ విండ్‌షీల్డ్(అద్దం) పగిలిపోయి పైలట్‌కు గాయాలయ్యాయి. ఆయన వెంటనే అప్రమత్తమై ల్యాండ్ చేయడంతో 140 మంది ప్రయాణికులు, సిబ్బంది సేఫ్‌గా బయటపడ్డారు. పైలట్ చేతిపై కాలిన గాయాలు ఉండటంతో ఉల్క ఢీకొట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

News October 20, 2025

ESIC ఇండోర్‌లో 124 ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

ESIC ఇండోర్‌లో 124 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, సీనియర్ రెసిడెంట్ పోస్టులను కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. పోస్టును బట్టి MBBS/MD/MSతో పాటు పని అనుభవం గలవారు ఈ మెయిల్ ద్వారా అప్లై చేసుకోవాలి. అక్టోబర్ 29, 30, 31 తేదీల్లో ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు. వెబ్‌సైట్: https://esic.gov.in/recruitments

News October 20, 2025

18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా: జగన్

image

AP: కూటమి ప్రభుత్వం ఇంటింటా వెలిగిస్తామన్న దీపాల్లో 18 నెలల్లో ఒక్కటైనా వెలిగిందా అని YS జగన్ ప్రశ్నించారు. ‘రూ.3వేల నిరుద్యోగ భృతి, మహిళలకు నెలకు రూ.1500, రైతులకు ఏడాదికి రూ.20,000, పిల్లలకు ఏటా రూ.15,000, ఇంటింటికీ ఏటా 3 ఉచిత సిలిండర్లు, ఉద్యోగులకిచ్చిన హామీలు.. ఇవన్నీ వెలగని దీపాలే కదా?’ అని ట్వీట్ చేశారు. తామందించిన 30 పథకాలు అనే దీపాలను ఆర్పేసి చీకటికి ప్రతినిధులయ్యారంటూ విమర్శించారు.