News March 21, 2025
నక్కపల్లి: అనుమానస్పద స్థితిలో వ్యక్తి మృతి

నక్కపల్లి మండలం నల్లమట్టిపాలెంకు చెందిన ఎన్.రాము (54) రాజయ్యపేట శివారు కల్లుపాకల వద్ద అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ నెల 19న పొలానికి వెళ్లిన రాము ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకుతుండగా గురువారం కల్లుపాకల వద్ద శవమై కనిపించాడు. ఇతని మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్నందున కుటుంబ సభ్యులు నక్కపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సన్నిబాబు తెలిపారు.
Similar News
News January 11, 2026
HYD: చైనా మాంజాతో సాఫ్ట్వేర్ ఇంజినీర్ చెయ్యి కట్!

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చైనా మాంజా తగిలి సాఫ్ట్వేర్ ఉద్యోగికి తీవ్ర గాయాలయ్యాయి. గచ్చిబౌలి నుంచి హఫీజ్పేట్ వైపు బైక్పై చైతన్య (27) వెళ్తున్నాడు. బొటానికల్ గార్డెన్ ఫ్లైఓవర్ పైకి రాగానే చైతన్య చేయికి గాలి పటం మాంజా తగిలింది. దీంతో మాంజా చెయ్యికి చుట్టుకోవడంతో చైతన్య చెయ్యి తెగింది. తీవ్ర గాయాలు అయిన చైతన్యను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.
News January 11, 2026
విశాఖ జూ పార్క్లో ముగిసిన వింటర్ క్యాంప్

విశాఖ జూ పార్క్లో 4 రోజుల నుంచి జరుగుతున్న వింటర్ క్యాంప్ ఆదివారంతో ముగిసింది. జనవరి 8వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఈ క్యాంప్ నిర్వహించిన్నట్లు క్యూరేటర్ మంగమ్మ తెలిపారు. వింటర్ క్యాంప్తో వన్యప్రాణుల ప్రపంచాన్ని పిల్లలకు పరిచయం చేశారు. ముఖ్యంగా జూ పార్కులో వెటర్నరీ హాస్పిటల్, జంతువుల నివాసాలు, వాటి ఆహారపు అలవాట్లు, వాటి ప్రత్యేక లక్షణాలపై అవగాహన కల్పించారు.
News January 11, 2026
WGL: ఓసీ సంఘాల డిమాండ్స్ ఇవే

1. ఓసీల రక్షణకు జాతీయ స్థాయిలో <<18829162>>ఓసీ కమిషన్<<>> ఏర్పాటు చేసి, రాష్ట్రస్థాయిలో పటిష్ఠంగా అమలు చేయాలి
2. విద్య, ఉద్యోగాలు, పదోన్నతుల్లో ఓసీలపై జరుగుతున్న వివక్షతను పూర్తిగా తొలగించాలి
3. ఈడబ్ల్యూఎస్ పథకాన్ని పటిష్ఠంగా అమలు చేసి, ఆదాయ పరిమితిని రూ.10 లక్షలకు పెంచాలి
4. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్కు షరతులు లేని ఐదేళ్ల గడువు కల్పించాలి.
5. ఓసీలకు ఉద్యోగ వయోపరిమితి సడలింపు చేయాలి


