News April 14, 2025

నక్కపల్లి: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

image

సముద్రంలో సోమవారం అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు నెలలకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంది. అనకాపల్లి జిల్లాలో గల తీరప్రాంతాలైన అచ్యుతాపురం, పాయకరావుపేట, పరవాడ, రాంబిల్లి, ఎస్ రాయవరం, నక్కపల్లిలో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు.

Similar News

News November 13, 2025

పిట్లం: ఎదురుగా వాహనం వస్తే అంతే సంగతులు!

image

బిచ్కుంద నుంచి బాన్సువాడ, అలాగే పిట్లం నుంచి బాన్సువాడ వెళ్లే రహదారులపై రైతులు రెండు వైపులా ధాన్యాన్ని ఆరబెట్టడంతో రాకపోకలు సాగించే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రహదారి మధ్యలో కేవలం కొంత భాగం మాత్రమే మిగలడంతో ఎదురెదురుగా వాహనాలు వచ్చినప్పుడు వెళ్లలేని పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా రాత్రి సమయంలో రోడ్లపై ఆరబోసిన ధాన్యం కుప్పలు కనిపించక ఢీకొట్టడంతో ప్రమాదాలు జరుగుతున్నాయి.

News November 13, 2025

రేపటి తరానికి మార్గదర్శనం మన అలవాట్లే

image

మంచి అలవాట్లు మన కోసమే కాదు, మన చుట్టూ ఉన్నవారికి, ఇంట్లో పిల్లలకు ఆదర్శంగా ఉంటాయి. ఓ వ్యక్తి ఆఫీస్‌ సమయానికి 20 నిమిషాల ముందు లేచి, హడావిడిగా సిద్ధమయ్యేవాడు. కొన్నాళ్లకు అతడి కుమారుడు కూడా అదే పద్ధతిని అనుసరించాడు. మనం నేర్పించే ప్రతి పాఠం, మన నడవడిక నుంచే మొదలవుతుంది. అందుకే, మన అలవాట్లు మనల్నే కాక, మన తర్వాత తరాలను కూడా ప్రభావితం చేస్తాయని మరువకూడదు. మంచి అలవాట్లే నిజమైన వారసత్వం. <<-se>>#Jeevanam<<>>

News November 13, 2025

17కు చిన్నఅప్పన్న బెయిల్ పిటిషన్ వాయిదా

image

కల్తీ నెయ్యి కేసులో TTD మాజీ ఛైర్మన్ YV సుబ్బారెడ్డి PA చిన్న అప్పన్న బెయిల్ పిటిషన్ ఈనెల 17కు వాయిదా పడింది. నెల్లూరు సీబీఐ కోర్టులో బుధవారం విచారణ జరగ్గా.. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జయశేఖర్ వాదనలు వినిపించారు. నిందితుడికి బెయిల్ ఇస్తే సాక్షాలు తారుమారయ్యే అవకాశం ఉందనన్నారు. మరో వైపు సీబీఐ అధికారులు సైతం కస్టడీ పిటిషన్ వేశారు. 17న కస్టడీ లేదా బెయిల్ పిటిషన్‌పై నిర్ణయం వచ్చే అవకాశం ఉంది.