News April 14, 2025
నక్కపల్లి: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

సముద్రంలో సోమవారం అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు నెలలకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంది. అనకాపల్లి జిల్లాలో గల తీరప్రాంతాలైన అచ్యుతాపురం, పాయకరావుపేట, పరవాడ, రాంబిల్లి, ఎస్ రాయవరం, నక్కపల్లిలో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు.
Similar News
News November 18, 2025
ప్రధాని, రాష్ట్రపతి పర్యటనపై సమీక్ష: అడిషనల్ DG

బాబా జయంతి వేడుకలకు ప్రధాని, రాష్ట్రపతి పర్యటనల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర అడిషనల్ DG పోలీసు అధికారులకు సూచించారు. పుట్టపర్తిలో సోమవారం రాత్రి పోలీసు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 19న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, 22 &23 తేదీల్లో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, పలువురు ముఖ్యమంత్రులు, గవర్నర్లు, వివిధ రాష్ట్రాల నుంచి వీవీఐపీలు వస్తున్న నేపథ్యంలో అందరిని అలెర్ట్ చేశారు.
News November 18, 2025
బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.
News November 18, 2025
బంగ్లాదేశ్ యువకుడిని అరెస్ట్ చేసిన అనకాపల్లి పోలీసులు

బాలికతో సహజీవనం చేస్తున్న బంగ్లాదేశ్కు చెందిన మహమ్మద్ (విక్రమ్ ఆలీ)ని అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద అరెస్ట్ చేసి పోక్సో కేసు నమోదు చేసినట్లు సీఐ ప్రేమ్ కుమార్ సోమవారం తెలిపారు. పాస్ పోర్ట్, వీసా లేకుండా కాకినాడలో ఉంటూ బంగ్లాదేశ్కు చెందిన మైనర్ బాలికను వివాహం చేసుకుంటానని ఇక్కడికి తీసుకువచ్చి సహజీవనం చేస్తున్నట్లు పేర్కొన్నారు. అనకాపల్లి రైల్వే స్టేషన్ వద్ద వీళ్లిద్దరిని పట్టుకున్నామన్నారు.


