News April 14, 2025
నక్కపల్లి: నేటి అర్ధరాత్రి నుంచి సముద్రంలో చేపల వేట నిషేధం

సముద్రంలో సోమవారం అర్ధరాత్రి నుంచి జూన్ 15వ తేదీ వరకు చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధించింది. మత్స్య సంపద వృద్ధి చెందేందుకు ప్రభుత్వం ప్రతి ఏటా రెండు నెలలకు సముద్రంలో చేపల వేటను నిషేధిస్తుంది. అనకాపల్లి జిల్లాలో గల తీరప్రాంతాలైన అచ్యుతాపురం, పాయకరావుపేట, పరవాడ, రాంబిల్లి, ఎస్ రాయవరం, నక్కపల్లిలో మత్స్యకారులు సముద్రంపై ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు.
Similar News
News October 15, 2025
ఒక్కరోజే రెండుసార్లు పెరిగిన బంగారం ధర!

గంటల వ్యవధిలోనే బంగారం ధరలు <<18010097>>రెండోసారి<<>> పెరిగాయి. HYD బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,090 పెరిగి రూ.1,29,440కు చేరింది. 22క్యారెట్ల 10 గ్రా.ల గోల్డ్ రేటు రూ.1,000 పెరిగి రూ.1,18,650గా ఉంది. వెండి ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు. ఉదయం KG సిల్వర్పై రూ.1,000 పెరగడంతో రూ.2,07,000కు చేరింది. 18 క్యారెట్ల బంగారం ధర కూడా GSTతో కలుపుకొని దాదాపు రూ.లక్షకు చేరడం గమనార్హం.
News October 15, 2025
రంజీ DAY-1: మ్యాచ్ HYD కంట్రోల్లో

రంజీ 2025-26 ఎలైట్ గ్రూప్ మ్యాచ్లో ఢిల్లితో HYD నెక్ట్స్ జెన్ స్టేడియంలో తలపడుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన తిలక్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆద్యంతం మనోళ్లు బౌలింగ్తో ఎదురుదాడికి దిగారు. టీ బ్రేక్కి ఢిల్లీ 55 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తొలుత ఢిల్లి తడబడినా కెప్టెన్ ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్ నిలబెట్టారు. HYD బౌలర్లలో మిలింద్ 2, బి.పున్నయ్య 1 వికెట్ పడగొట్టారు.
News October 15, 2025
మంగళగిరి: పోలీస్ అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లు పరిశీలన

దేశవ్యాప్తంగా అక్టోబర్ 21న నిర్వహించబోతున్న పోలీసు అమరవీరుల దినోత్సవ ఏర్పాట్లను మంగళగిరి ఏపీఎస్పీ 6 బెటాలియన్లో ఎస్పీ వకుల్ జిందాల్ బుధవారం పరిశీలించారు. భద్రత, అమరవీరుల స్తూపం, స్టేజి నిర్మాణం, పరేడ్ స్థలాలను బెటాలియన్ ఇన్ఛార్జ్ కమాండెంట్ ఏ.మురళీ ఎస్పీకి వివరించారు. సమన్వయంతో పనిచేసి కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలన్నారు.