News March 28, 2024

నక్కపల్లి: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

నక్కపల్లి మండలం గుల్లిపాడు, నర్సీపట్నం రోడ్డు రైల్వేస్టేషన్ల మధ్య మృతదేహం లభ్యమయ్యింది. విశాఖ నుంచి రాజమండ్రి వెళ్తున్న రైలులో ప్రయాణిస్తున్న వ్యక్తి గురువారం ప్రమాదవశాత్తు జారిపడి మృతి చెందినట్లు తుని రైల్వే ఎస్సై షేక్ అబ్దుల్ మరూఫ్ తెలిపారు. మృతుడి వయస్సు సుమారు 45 సంవత్సరాలుంటాయని, అతని వివరాలు తెలియలేదన్నారు. తుని ఆస్పత్రిలోని మార్చురీలో మృతదేహాన్ని భద్రపరిచామని చెప్పారు.

Similar News

News February 8, 2026

విశాఖ: కలెక్టరేట్‌లో రేపు పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్

image

విశాఖ జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్), రెవెన్యూ క్లినిక్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు జరుగుతాయని, రెవెన్యూ అధికారులతో పాటు అన్ని శాఖల జిల్లా అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు. ప్రజలు తమ సమస్యలకు సంబంధించిన అర్జీలను పూర్తి వివరాలతో సమర్పించాలని సూచించారు.

News February 8, 2026

కేజీహెచ్ జీఎన్ఎం పరీక్షలో మాస్ కాపీయింగ్.. ముగ్గురు డిబార్

image

విశాఖ కేజీహెచ్ అనుబంధ ప్రభుత్వ నర్సింగ్ స్కూల్లో జీఎన్ఎం వార్షిక పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందన్న సమాచారం మేరకు కౌన్సిల్ డైరెక్టర్ సునీత ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు విద్యార్థినులు కాపీ కొడుతూ పట్టుబడి డిబార్ అయినట్లు అధికారులు తెలిపారు.

News February 8, 2026

విశాఖ: వేసవికి వాటర్ టెన్షన్ లేనట్లేనా..!

image

విశాఖకి వచ్చే వేసవిలో నీటి కొరత ఉండదని GVMC అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం నగరానికి తాగునీరు అందించే ఏలేరు, రైవాడ, మేఘాద్రి గెడ్డ, తాటిపూడి, గోస్తనీ, ముడసర్లోవ, గంభీరం రిజర్వాయర్లలో ఉన్న నీటి నిల్వలతో కనీసం 6 నెలల పాటు నిరంతర నీటి సరఫరా చేయగలమన్నారు. వేసవి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగంపై పర్యవేక్షణ కొనసాగుతోందని GVMC నీటి సరఫరా అధికారి పల్లంరాజు స్పష్టం చేశారు.