News March 28, 2025
నక్కపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన RI

నక్కపల్లిలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. గత కొంతకాలం నుంచి ఈ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలంలో బోరు కోసం ఒక రైతు నుంచి రూ.12 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఆర్ఐ కన్నబాబు శుక్రవారం రెడ్ హ్యాండెడ్గా దొరికిపోయారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆర్ఐ కన్నబాబును అరెస్ట్ చేశారు.
Similar News
News September 17, 2025
NTR: రేపటితో ముగియనున్న ఉద్యోగాల దరఖాస్తు గడువు

APCRDAలో కాంట్రాక్ట్ పద్ధతిన 5 ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదలైంది. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్, గ్రూప్ డైరెక్టర్, ల్యాండ్స్కేప్ ఆర్కిటెక్ట్, టీం లీడర్(MIS) పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నట్లు కమిషనర్ కె.కన్నబాబు తెలిపారు. అభ్యర్థులు SEP18లోపు https://crda.ap.gov.in/ వెబ్సైట్లో ఆన్లైన్లో దరఖాస్తు చేయాలన్నారు. విద్యార్హతలు, వేతనం వివరాలకు పై వెబ్సైట్ చూడవచ్చన్నారు.
News September 17, 2025
అల్లూరి జిల్లాలో రాగల ఐదు రోజుల్లో వర్షాలు

అల్లూరి జిల్లాలో రానన్న ఐదు రోజుల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి మంగళవారం తెలిపారు. ఈ నెల 21వ తేదీ వరకు చింతపల్లి, పాడేరు, అరకు, రంపచోడవరం డివిజన్ల పరిధిలో కనిష్ఠంగా 5.2 మి.మీ నుంచి గరిష్ఠంగా 10 మి.మీ వర్షపాతం నమోదు అవుతుందన్నారు. గాలిలో తేమ 65 నుంచి 88 శాతం ఉంటుందన్నారు.
News September 17, 2025
బతుకమ్మ పండుగకు గ్రేటర్ వరంగల్లో ఘనతరమైన ఏర్పాట్లు

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(GWMC) కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ మంగళవారం ప్రధాన కార్యాలయంలో బతుకమ్మ పండుగ నిర్వహణపై సమీక్ష నిర్వహించారు. హన్మకొండలో 26 ప్రాంతాలు, వరంగల్లో 20 ప్రాంతాల్లో జరగనున్న వేడుకలకు శానిటేషన్, విద్యుత్ లైటింగ్, తాగునీటి సదుపాయాలను సమయానికి సిద్ధం చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.