News March 28, 2025

నక్కపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన RI

image

నక్కపల్లిలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. గత కొంతకాలం నుంచి ఈ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలంలో బోరు కోసం ఒక రైతు నుంచి రూ.12 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఆర్ఐ కన్నబాబు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆర్‌ఐ కన్నబాబును అరెస్ట్ చేశారు.

Similar News

News November 14, 2025

పల్నాడు జిల్లాస్థాయి సీనియర్ జూడో జట్ల ఎంపిక పోటీలు

image

పల్నాడు జిల్లా జూడో అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 16న నరసరావుపేటలోని కోడెల శివప్రసాద్ రావు స్టేడియంలో జిల్లా స్థాయి సీనియర్ జూడో పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులు ఈ నెల 22, 23 తేదీలలో కాకినాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికవుతారని అసోసియేషన్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి కొప్పుల నరసింహారావు తెలిపారు.

News November 14, 2025

ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలి: SP

image

వాంకిడి పోలీస్ స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్, ఎఎస్పీ తనిఖీ చేసారు. పోలీస్ స్టేషన్ పరిసరాలు, తదితర విభాగాలను క్షుణ్నంగా పరిశీలించారు. SI మహేందర్‌ను పలు అంశాలపై ప్రశ్నించారు. పెండింగ్లో ఉన్న కేసులపై సమీక్షా చేసి, పెండింగ్ కేసుల సంఖ్య తగ్గించేందుకు అవసమైన చర్యలు చేపట్టాలని సూచించారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని, ప్రజలతో స్నేహపూర్వకంగా మెలగాలని సూచించారు.

News November 14, 2025

VZM: ‘మధుమేహంపై జిల్లా వ్యాప్తంగా అవగాహన సదస్సులు’

image

ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా జిల్లాలోని అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అవగాహన సదస్సులు, స్క్రీనింగ్ పరీక్షలను శుక్రవారం నిర్వహించినట్లు DMHO జీవనరాణి తెలిపారు. మొత్తం 44 కార్యాలయాల సిబ్బందికి టెస్టులు చేయడంతో పాటు, అన్ని ప్రాథమిక పాఠశాలల్లో విద్యార్థులకు మధుమేహంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. మధుమేహంపై అవగాహన పెంచుకోవాలని సూచించారు.