News March 28, 2025

నక్కపల్లి: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన RI

image

నక్కపల్లిలో ఏసీబీ అధికారుల దాడులు కలకలం రేపాయి. గత కొంతకాలం నుంచి ఈ కార్యాలయంపై అనేక అవినీతి ఆరోపణలు వినిపిస్తున్నాయి. పొలంలో బోరు కోసం ఒక రైతు నుంచి రూ.12 వేలు లంచం డిమాండ్ చేస్తూ ఆర్ఐ కన్నబాబు శుక్రవారం రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. ఈ మేరకు ఏసీబీ అధికారులు కేసు నమోదు చేసి ఆర్‌ఐ కన్నబాబును అరెస్ట్ చేశారు.

Similar News

News April 23, 2025

బాపట్ల జిల్లాలో 83.96% ఉత్తీర్ణత..!

image

బుధవారం ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన పదవ తరగతి పరీక్ష ఫలితాలలో బాపట్ల జిల్లా 83.96% ఉత్తీర్ణత సాధించింది. మొత్తం 16,182 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 13,586 మంది ఉత్తీర్ణత సాధించారు. 8,143 మంది బాలురు పరీక్షకు హాజరు కాగా 6,615మంది 81.24% తో పాసయ్యారు. 8,039 బాలికలు పరీక్షకు హాజరు కాగా 6,971మంది 86.71%తో ముందంజలో ఉన్నారు.

News April 23, 2025

RED ALERT: మూడు రోజులు జాగ్రత్త

image

TG: రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాబోయే మూడు రోజులపాటు తీవ్ర వడగాలులతోపాటు ఉక్కపోత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలకు రెడ్ అలర్ట్, సంగారెడ్డి, రంగారెడ్డి, హైదరాబాద్, వికారాబాద్, భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే ఎల్లుండి పలు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.

News April 23, 2025

పహల్‌గామ్ దాడి.. కావలి వ్యక్తి బాడీలో 42 బుల్లెట్లు!

image

పహల్‌గామ్ దాడి ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన నెల్లూరు జిల్లా కావలికి చెందిన మధుసూధన్ రావు శరీరంలో 42 బుల్లెట్లు ఉన్నట్లు తెలుస్తోంది. AK-47తో ఆయనను వెంటాడి వేటాడి చంపినట్లు సమాచారం. కాగా మధు బెంగళూరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. హాలిడే ట్రిప్ కోసం తన ఫ్యామిలీతో కలిసి ఆయన కశ్మీర్ పర్యటనకు వెళ్లి ముష్కరుల చేతిలో ప్రాణాలు కోల్పోయారు.

error: Content is protected !!